ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వేతన సవరణ ఫైల్కు సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. దీంతో వారి పీఆర్సీకి క్లియర్ అయింది. వాస్తవానికి 10న వేతన సవరణకు ఆర్థిక శాఖ ఒకే చెప్పి సీఎం సంతకం కోసం ఫైల్ను పంపించారు. వాస్తవానికి ఈ నెల 21లోగా క్లియరెన్స్ రాకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఏరియర్స్ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించారు. అయితే సాగర్ ఉప ఎన్నికలు, ఇప్పుడు వచ్చిన పుర ఎన్నికల నేపథ్యంలో సమయం కుదరకపోవడంతో ఫైల్ పెండింగ్ పడింది. కానీ ఎట్టకేలకు క్లియర్ అయింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతన పెంపుపై ఆర్థిక శాఖ ఎలాంటి మార్గదర్శకాలు, ప్రతిపాదనలు చేయలేదు. కానీ సీఎం మాత్రం వేతన సవరణ కమిషన్ సూచనలను పరిగణలోకి తీసుకుని వేతనాల పెంపును చేయాలంటూ నిర్ణయం తీసుకుని, ఫైల్పై సంతకం చేశారు. దీంతో ఉద్యోగవర్గాలందరికీ పీఆర్సీ అమలు చేస్తున్నారు. మానవీయ కోణంలో ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్,కాంట్రాక్ట్ ఉద్యోగులు,హోంగార్డులు,అంగన్వాడీలు,ఆశా వర్కర్లు,విద్యా వాలంటీర్లు,వీఆర్ఏ,వీఏవో,సర్వ శిక్షఅభియాన్ సిబ్బందికి కూడా పీఆర్సీ వర్తింపజేస్తున్నట్లు గతంలోనే సీఎం ప్రకటించినట్లుగా ఈ పీఆర్సీతో మొత్తంగా 9,17,797 మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. ఈ నెల పెరిగిన సొమ్ముతో ఉద్యోగవర్గాలు వేతనాలు అందుకోనున్నాయి.
అయితే అంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే ఉద్యోగులకు ఒక చేదువార్త కూడా ఉన్నది. అదేమిటంటే గతంతో పోల్చితే ప్రస్తుతం వస్తున్న హెచ్ఆర్ఏ తగ్గనుంది. హెచ్ఆర్ఏ స్లాబులను 11,13,17,24 శాతంగా పీఆర్సీ నిర్ణయించింది. మెట్రో నగరాల్లో హెచ్ఆర్ఏని 30శాతం నుంచి 24శాతానికి కుదించడాన్ని తప్పు పడుతున్నారు. ప్రస్తుతం హెచ్ఆర్ఏ శ్లాబులు 11, 13, 17,24గా నిర్ణయించగా… గతంలో 12,14,20,30 శాతంగా శ్లాబులు ఉన్నాయి.