మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఈ చిత్రం తర్వాత చిరు ‘లూసీఫర్’ రీమేక్ చేయనున్నారు.
ఈ రీమేక్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే లూసీఫర్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తి కాగా.. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రం తర్వాత చిరు రెండు చిత్రాలు చేయనున్నాడు.
ఒకటి మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ బ్లాక్ బస్టర్ వేదాళం రీమేక్ కాగా.. మరొకటి బాబీ దర్శకత్వంలో సినిమా. అయితే ఈ రెండు ప్రాజెక్ట్స్ లో ఏది ముందు మొదలవుతుంది అనే క్లారిటీ మాత్రం చిరు ఆ ఇద్దరు దర్శకులకు ఇవ్వకుండా తికమక పెడుతున్నారట. దీంతో వారిద్దరూ కన్ఫ్యూజన్ లో పడ్డారని ప్రచారం జరుగుతోంది మరి చిరు ఏ డైరెక్టర్కు ముందుగా ఛాన్స్ ఇస్తారో చూడాలి.