టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 13న విడుదల చేయనున్నారు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ కూడా ఓ కీలక పాత్ర పోషించబోతోంది. తాజాగా ఈ యాంకరమ్మ పుష్ప సెట్లో కూడా అడుగు పెట్టింది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. మంచి రోజులు ముందున్నాయి. మళ్లీ సినిమా చేయడం ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ చేసింది. కాగా, అనసూయ గతంలో కూడా సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో అనసూయ రంగమ్మత్తగా అదరగొట్టింది. ఇక ఇప్పుడు అనసూయకు సుకుమార్ మరో ఛాన్స్ ఇచ్చాడు.
https://www.instagram.com/p/CN7c8L_LoEd/?utm_source=ig_web_copy_link