టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఇదిలా ఉంటే.. పుష్ప తర్వాత బన్నీ కొరటాల శివతో సినిమా చేస్తాడని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా కొరటాల ఎన్టీఆర్తో సినిమా ప్రకటించాడు. దీంతో బన్నీ తన తదుపరి చిత్రాన్ని ఏ డైరెక్టర్తో చేస్తాడు అన్నది అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో బన్నీ సినిమా ఉంటుందని తెలుస్తోంది.
ఇప్పటికే ఓ ఫుల్ యాక్షన్ స్టోరీని సిద్ధం చేసి బన్నీని వినించాడని.. అది బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ సినిమా పక్కా యాక్షన్ తో సాగే కామెడీ ఎంటర్టైనర్ గా ఉండనుందని.. ముఖ్యంగా బన్నీకి సరిపడే స్టోరీ అని తెలుస్తోంది. కాగా, బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలయ్యతో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.