రామ్ చరణ్ పాట లీక్ అవ్వటంతో షాక్ లో ఆచార్య టీం.!

తాజాగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ కరోనా కారణంగా ప్రస్తుతం ఆగిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాట సోషల్ మీడియాలో లీక్ కావడంతో మూవీ యూనిట్ను బాగా కలవరపెడుతుంది. ఇప్పటికే ఆచార్య సినిమా నుంచి రిలీజ్ అయిన లాహే లాహే పాటకు మంచి స్పందన వచ్చింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటలో చిరంజీవి డాన్స్ స్టెప్స్ అదిరిపోయాయి. రెండో పాట కోసం అభిమానులు ఏంత్తో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఇది లీక్ అవ్వడం తో మూవీ టీం అంతా ఆందోళన చెందుతున్నారు.

ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. చరణ్ సరసన నటి పూజ హెగ్డే నటిస్తుంది. ఆచార్యలో ఇద్దరి పై ఒక రొమాంటిక్ పాట కూడా ప్లాన్ చేసాడట కొరటాల శివ. నీలాంబరి అంటూ సాగే ఈ పాట తాజాగా ఆన్లైన్లో లీక్ అయ్యి ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇది తెలిసిన వెంటనే చిత్రయూనిట్ ఆ పాటకు సంబంధించిన లింకులను తొలగించే పనిలో ఉన్నారు. లీకైన నీలాంబరి పాటను త్వరలోనే అధికారికంగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.