గతేడాది బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ మూవీలో నటించిన ప్రిన్స్ మహేష్బాబు ప్రస్తుతం సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ డైరెక్షన్లో ఓ సినిమా (వర్కింగ్ టైటిల్ ఏజెంట్ శివ)లో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ డీవీవీ దానయ్య నిర్మాతగా కొరటాల శివ దర్శకత్వం వహించే క్రేజీ ప్రాజెక్టులో నటించనున్న సంగతి తెలిసిందే.
మురుగదాస్ సినిమాతో పాటు, కొరటాల శివ సినిమాపై సైతం భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత మహేష్ కేరీర్లోనే 25వ సినిమాగా తెరకెక్కే ల్యాండ్మార్క్ సినిమా సైతం అప్పుడే ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్లో ఇద్దరు అగ్ర నిర్మాతలు అయిన చలసాని అశ్వనీదత్ – దిల్ రాజు సంయుక్తంగా నిర్మించే ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తాడు.
కొరటాల శివ తర్వాత మహేష్ ఈ సినిమాలో నటించాల్సి ఉన్నా…అప్పుడే ఈ సినిమాకు రిలీజ్ టైం కూడా ఫిక్స్ చేసేశారు. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు తాజాగా శర్వానంద్తో శతమానం భవతి సినిమాను తీసి హిట్ కొట్టారు. ఈ సందర్భంగా రాజు మహేష్ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. మహేష్-వంశీ కాంబోలో తమ బ్యానర్లో నిర్మించే సినిమాను ఈ యేడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో షూటింగ్ స్టార్ట్ చేసి 2018 సమ్మర్లో రిలీజ్ చేస్తామని రాజు తెలిపారు.