కేంద్రం రాష్ట్రానికిచ్చిన ప్యాకేజ్ ని రెండు పాచి పోయిన లడ్డులతో మొన్నామధ్య కాకినాడ సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శిస్తే తాజాగా వైసీపీ అధ్యక్షుడు వైస్ జగన్ కేంద్రం ఇస్తానంటున్న రాయితీలు శెనక్కాయలు బెల్లం తో సమానమని వ్యాఖ్యానించారు.రాయలసీమ ప్రాంతంలో శెనిక్కాయలు బెల్లం అనేది ఒక టైం పాస్ స్నాక్ ఐటెం లాంటిది.కేంద్రం ఇస్తానంటున్న పన్ను రాయితీలు కూడా అలాంటివేనని జగన్ చెప్పుకొచ్చారు.
పవన్,జగన్ ఇద్దరి సభల అజెండా ఒకటే అయినా పవన్ ప్రశ్నించకపోగా ఇంకాస్త గందరగోళం లోకి నెట్టేశాడు మొత్తం వ్యవహారాన్ని.అయితే జగన్ మాత్రం యువతకు,విద్యార్థులకు ప్రత్యేక హోదా ఆవశ్యకతను,ప్రయోజనాల్ని, జరిగిన,జరుగుతున్న మోసాన్ని పూసగుచ్చినట్టు ఓ అధ్యాపకుడి తీరున వివరించి ఆకట్టుకున్నాడు.
జగన్ యువభేరి ఎంతో విశ్లేనానాత్మకంగా అంతే ఆలోచింపచేసేలా సాగిన తీరు మెచ్చుకోవాల్సిందే .ఎదో వచ్చాం..రాజకీయాలు మాట్లాడి వెళ్ళిపోయాము అని కాకుండా ప్రత్యేకహోదా వల్ల మనకేంటి..అసలు దానికి అడ్డు ఏంటి..దాని పూర్వాపరాలేంటి అన్నవి ఆధారాలతో సహా యువతకు దిశానిర్దేశం చేసిన తీరు అమోఘం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వంద వైఖరిని జగన్ ప్రశ్నించారు.ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించడానికి అదేమైనా చంద్రబాబు అత్తగారి సొమ్మా?ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినదించాడు జగన్.ఈ మధ్య కాలం లో పచ్చ మీడియాకి పచ్చ కామెర్లు ఏ రేంజ్ లో వచ్చాయో మనకు తెలియంది కాదు.పచ్చ మీడియా మొత్తం ఒక పద్ధతి ప్రకారం..అంచలంచలుగా ప్యాకెజీ ని ఎలా నెత్తికెత్తుకుని ప్రజలపై రుద్దేసి ఆమోదింపచేయడానికి పడుతున్న తాపత్రయం అంతా ఇంతాకాదు.
వీటన్నిటి విపులంగా ప్రశ్నిస్తూ..ఆలోచింపచేసింది జగన్ యువభేరి.ఆఖరుకు పచ్చ పైత్యం పరాకాష్టకు చేరిన ఆంధ్రజ్యోతి లో మన బొంకయ్య నాయుడు బొంకిన 2 లక్షల పైచిలుకు ప్యాకెజీ పైన కూడా జగన్ కడిగేసాడు.ఇక మన సీఎం గోరి అపరిచిత,గజినీ వేషాల గురించి క్లిప్పింగులతో సహా యువతకు జగన్ వివరించాడు.అయినా నిద్రపోయే వాడిని లేపొచ్చు..చెవిటోడు ముందు శంఖం ఊది వినిపించొచ్చు కానీ నిద్ర,చెవుడు అని నటించేవాడిని ఎంత లేపినా ఎన్ని శంఖాలు ఊడినా ఏమి ప్రయోజనం చెప్పండి.మన చంద్రన్న దీ సేమ్ టు సేమ్.