వైఎస్ఆర్ జయంతి..మోహన్‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

దివంగ‌త ముఖ్య‌మంత్రి, తెలుగు ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మ‌హానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జ‌యంతి నేడు. ఈ నేప‌థ్యంలోనే అన్ని జిల్లాల్లోనూ వైఎస్ఆర్ జయంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. మ‌రోవైపు ఇడుపులపాయలోని ఆయ‌న సమాధి వద్ద కుటుంబసభ్యులు, అభిమానులు నివాళి అర్పిస్తున్నారు. ఇదిలా ఉంటే.. వైఎస్ఆర్ జయంతి సంద‌ర్భంగా విల‌క్ష‌న న‌టుడు, టాలీవుడ్ క‌ల‌క్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు సోష‌ల్ మీడియా ద్వారా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. `స్నేహశీలీ, రాజఠీవి, రాజకీయ దురంధరుడు, మాట తప్పడు […]

వైసీపీ రెబల్ కి జగన్ సర్కార్ షాక్..?

ప్ర‌స్తుతం ఏపీలో వైసీపీ ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజు వ్య‌వ‌హారం ఎంత హాట్ టాపిక్ గాఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఇప్పుడు ఈ రెబ‌ల్ ఎంపీపై జగన్ సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది. జగన్ పై, పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఎంపీ రఘురామ పేరును వైసీపీ అధికార వెబ్ సైట్ లో తొలగించి తాజాగా షాక్ ఇచ్చారు. అంతే కాదు ఆ పార్టీ ఎంపీల జాబితా నుంచి రఘురామకృష్ణంరాజు పేరును తీసేసారు పార్టీ అధిష్టానం. రాజ్యసభ, లోక్ […]

నేడు ఢిల్లీకి సీఎం జ‌గ‌న్‌..అమిత్ షాతో భేటీ అందుకేన‌ట‌?!

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రేడు ఢిల్లీ వెళ్ల‌నున్నారు. ఈ రోజు పదిన్నర గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో జగన్ బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు ఢిల్లీలోకి చేరుకుంటారు. ఆ తర్వాత వరుసగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. రాత్రి 9 గంటలకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అవుతారు. మూడు రాజధానుల ఏర్పాటుకు సహకారం కోరడంతోపాటు, పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలపై జలశక్తి మంత్రితో సీఎం చర్చించనున్నారు. అలాగే కరోనా […]

టీడీపీకి బిగ్ షాక్‌..పార్టీని వీడ‌నున్న ప‌న‌బాక ల‌క్ష్మి?!

తెలుగు దేశం పార్టీకి, అధినేత నారా చంద్ర‌బాబు నాయుడికి మ‌రో బిగ్ షాక్ త‌గ‌ల‌నుంది. మాజీ మంత్రి పన‌బాక లక్ష్మి టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ ఉన్నార‌న్న వార్త‌లు ప్ర‌స్తుతం ఊపందుకున్నాయి. పన‌బాక లక్ష్మి భర్త పన‌బాక కృష్ణయ్య కూడా ఆమెనే అనుసరిస్తార‌ని స‌మాచారం. గత ఎన్నికల్లో టీడీపీ తరపున తిరుపతి లోక్‌సభ స్థానానికి పోటీచేసిన ప‌న‌బాక ల‌క్ష్మి.. ఘోర ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. ఇక‌ ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి ఆమె పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా […]

పేదలకు జగన్ శుభ‌వార్త‌.. నేడు మ‌రో మ‌హ‌త్త‌ర పథకానికి శ్రీ‌కారం!

క‌రోనా విప‌త్క‌ర స‌మ‌యంలోనూ ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలో ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఇక నేడు పేద‌ల కోసం జ‌గ‌న్ మరో మ‌హ‌త్త‌ర ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి నేడు వర్చువల్ విధానంలో జ‌గ‌న్ `వైఎస్సార్ జగనన్న కాలనీ`ల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా తొలి విడతలో చేపట్టే 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకంలో భాగంగా ఇల్లు కట్టుకునే స్తోమత […]

ఏపీలో క‌రోనా క‌ట్ట‌డికి సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం?

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ అల్ల‌క‌ల్లోం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సెకెండ్ వేవ్‌లో విరుచుకు ప‌డుతున్న ఈ మాయ‌దారి వైర‌స్ దెబ్బ‌కు ప్ర‌జ‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ క‌రోనా వీర విహారం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి రోజు ఇర‌వై వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. పాక్షిక లాక్ డౌన్ విధించి రెండు వారాలు గడుస్తున్నా క‌రోనా వేగం త‌గ్గ‌డం లేదు. ఇలాంటి త‌రుణంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌రోనా క‌ట్ట‌డికి కీల‌క […]

మత్స్యకారులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జ‌గ‌న్‌!

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి రోజు రాష్ట్రంలో ఇర‌వై వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నారు. ఈ మ‌హ‌మ్మారిని అదుపు చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇక ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ జ‌గ‌న్ స‌ర్కార్ సంక్షేమ ప‌థకాల అమ‌లులో ఏ మాత్రం వెనుక‌డుగు వేయడం లేదు. తాజాగా మత్స్యకారులకు సీఎం జ‌గ‌న్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద వరుసగా మూడో […]

ఆ మాజీ మంత్రి మ‌ళ్లీ టీడీపీలోకి రివ‌ర్స్ జంప్ ?

రాజ‌కీయాలు ఎలాగైనా మారిపోవ‌చ్చు. ఏపార్టీకి ఎవ‌రూ శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌ని అంటారు. పార్టీ మారేవారు.. ఎప్పుడు ఎటు అవ‌కాశం ఉంటే.. అటు మారిపోతూ ఉంటారు. పార్టీలు కూడా త‌మ‌కు అనుకూలంగా ఉండే నేత‌ల‌కు ప‌ట్టం క‌ట్టేందుకు ప్రాధాన్యం ఇస్తుంటాయి. సో.. నాయ‌కులు కూడా ఎప్పుడైనా పార్టీ మారిపోవ‌చ్చ‌నే ధీమాలో ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఇలానే చేసేందుకు ప్ర‌కాశం జిల్లా చీరాల‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి పాలేటి రామారావు ప్ర‌య‌త్నిస్తున్నా ర‌ని […]

తిరుప‌తి ఉప ఎన్నిక‌..పోస్టల్ బ్యాలెట్ లో వైఎస్ఆర్‌సీపీ ఆధిక్యం!

తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి గత నెలలో జ‌రిగిన ఉప ఎన్నిక ఫ‌లితాలు నేడు రానున్న సంగ‌తి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ వైసీపీది ఘన విజయం అని చెప్పినా.. టీడీపీ, బీజేపీ అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్ర‌జ‌లంతా ఎంతో ఉత్కంఠ‌గా ఫ‌లితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక నేటి ఉద‌యం 8 గంట‌ల‌కు కౌంటింగ్ ప్రారంభం అయింది. తిరుపతి లోక్‌సభ నియో జకవర్గం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉండటంతో రెండు చోట్ల […]