విశాఖలో ఒక నిత్య పెళ్లి కొడుకు అరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 8 మందిని పెళ్లి చేసుకొని పోలీసులకు అడ్డంగా దొరికిన నిత్య పెళ్లికొడుకు. ఏకంగా 8 మందిని ప్రేమ వివాహం చేసుకున్నాడు అరుణ్ కుమార్ అనే వ్యక్తి. తీరా పెళ్లి చేసుకున్నాక, వాళ్ళను వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి తెచ్చేవాడు. అరుణ్ కుమార్ తమని వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేసేవాడని బాధితులు ఆరోపిస్తున్నారు. మొదటి భార్య కుమార్తెను కూడా వ్యభిచార ముఠాకు అమ్ముతానంటూ వేధింపులకు గురి చేసేవాడు. […]
Tag: vizag
వైసీపీలో పెరుగుతున్న ఒక వర్గం పెత్తనం …అసంతృప్తిలో మిగతా కులాలు
రాజకీయాలు ఒకప్పుడు నేతలను బట్టి మారుతుండేవి. కానీ, ప్రస్తుతం ట్రెండు మారింది. కులాల కార్డులే పార్టీలను, రాజకీయాలను శాసిస్తున్నాయి. అచ్చం ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే విపక్షం వైసీపీ విశాఖపట్నంలో ఎదుర్కొంటోందని వార్తలు వస్తున్నాయి. జిల్లాలో వైసీపీకి ఇప్పుడు కులం తగాదాలు మిన్నుముట్టాయట. ప్రస్తుతం రాష్ట్రంలో కాపులు తమ రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారిని చేరదీయడం వల్ల రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని భావించిన వైసీపీ.. నేతలు విశాఖలో ఈ వర్గాన్ని చేరదీశారట. […]
కమ్యూనిస్టులకు పవన్ దెబ్బేశాడుగా!
తనకు కమ్యూనిస్టులంటే గౌరవం ఉందని, వాళ్ల భావజాలం.. తన భావజాలంలో సారూప్యత ఉందని.. అవసరమైతే వాళ్లతో కలిసి పనిచేసేందుకైనా సిద్ధమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంకేతాలు ఇస్తూ వస్తున్నాడు. దీంతో కమ్యూనిస్టులు కూడా పవన్ తమతో దోస్తీకడతాడని ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే వారికి పవన్.. కూడా హ్యాండ్ ఇచ్చాడు. ప్రభుత్వ వైఫల్యాలు, విశాఖ భూ కుంభకోణంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని, ఇందుకు పవన్ కూడా తోడయితే తమకు మైలేజ్ వస్తుందని భావించిన కమ్యూనిస్టుల ఆశలు గల్లంతయ్యాయి. […]
వైసీపీపై ఇంటిలిజెన్స్ రిపోర్ట్…షాక్లో చంద్రబాబు
విశాఖలో టీడీపీ నేతల భూకుంభకోణం న్యూస్ ఏపీ రాజకీయవర్గాల్లో పెద్ద ప్రకంపనలే రేపింది. అధికార టీడీపీని టార్గెట్ చేసేందుకు ఈ ఇష్యూ విపక్ష వైసీపీకి పెద్ద అస్త్రంగా మారింది. ఈ క్రమంలోనే గురువారం వైసీపీ అధినేత జగన్ సేవ్ విశాఖ పేరుతో నిర్వహించిన మహాధర్నా ఇప్పుడు టీడీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ధర్నాకు కాస్త బాగానే జనాలు అటెండ్ అయ్యారని సీఎం చంద్రబాబుకు ఇంటిలిజెన్స్ సైతం రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ చూసిన […]
టీడీపీలో రాబోయే తరానికి కాబోయే నేతలు హల్ చల్
వారసత్వ రాజకీయాలకు టీడీపీ కూడా అనుకూలమే. దీనికి సీఎం తనయుడు, మంత్రి లోకేశ్ పెద్ద ఉదాహరణ. దీంతో నిన్న మొన్నటి వరకు వారసులను పార్టీకి దూరంగా ఉంచిన నేతలు ఇప్పడు తమ వారసులను పని గట్టుకుని ప్రోత్సహించి, పాలిటిక్స్లో దింపుతున్నారు. దీనికి నిన్న ముగిసిన విశాఖ టీడీపీ మహానాడు వేదిక అయింది. ఈ మహానాడులో టీడీపీ సీనియర్ నేతల పుత్రరత్నాలు.. అంటే రాబోయే తరానికి కాబోయే నేతలు హల్ చల్ చేశారు. వీరికి లోకేశ్ మార్గదర్శి, కార్యదర్శి.. […]
మహానాడులో ఆ ఇద్దరూ తప్పా….అందరూ బోర్
విశాఖ వేదికగా టీడీపీ నిర్వహించిన అతి పెద్ద పార్టీ పండుగ మహానాడుకు అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జయంతి ఆదివారం రావడంతో ఎక్కడెక్కడినుంచో అభిమానులు, కార్యకర్తలు వచ్చారు. అయితే, ఈ మహానాడు సందర్భంగా అధినేత చంద్రబాబు మొదలు కొని ఏపీ, తెలంగాణ అధ్యక్షులు, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రసంగించారు. అయితే, ఈ మూడు రోజుల పండుగలో కేవలం ఇద్దరి ప్రసంగాలు మాత్రమే ఆకట్టుకున్నాయనే టాక్ వచ్చింది. ముఖ్యంగా టీడీపీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి ప్రసంగానికి […]
హోదాను ప్రజలకు చేరనివ్వని మీడియా
ఉమ్మడి ఏపీ విభజన సమయంలో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామగ్రామాన స్ఫూర్తి ని రగిలించడంలో దినపత్రికలు ప్రధాన పాత్ర పోషించాయి. అలాగే మీడియాలోని అన్ని వర్గాలు తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచాయి! అలాగే తమిళులు జల్లికట్టుపై తెలిపిన నిరసనను మీడియా ఆకాశానికి ఎత్తేసింది. ఇప్పుడు వాటి స్ఫూర్తితో హోదా కావాలని పోరాడుతున్న ఏపీ ప్రజలకు మాత్రం మీడియా సపోర్ట్ ఉండటం లేదా? భావోద్వేగాలను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా అడ్డుకుంటోందా? అంటే అవుననే అంటున్నారు కొందరు […]
ఏపీకి హ్యాండ్ ఇచ్చిన ఈరోస్
లక్షల కోట్లలో ఎంవోయూలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడుల వరద ఖాయం. ఇక లక్షల సంఖ్యలో ఉద్యోగాలు తన్నుకుంటూ వచ్చేస్తాయి! అంటూ ఒక పక్క ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపుతోంది!! ఇప్పటికి రెండు సార్లు ఏపీలో పారిశ్రామిక సదస్సు జరిగింది. దేశవిదేశాలకు చెందిన కంపెనీలు ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ కూడా కుదుర్చుకుంటున్నాయి. మరి ఇవి అమలవుతున్నాయా? ఎంవోయూ కుదుర్చుకున్న కంపెనీలన్నీ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయా? అంటే లేదనే చెప్పాలి. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న పర్యాటక శాఖలోని వ్యవహారం […]
సోషల్ మీడియాలో హోదాపై నెగెటివ్ ప్రచారం
ఏపీకి ప్రత్యేక హోదా సాధించేవరకూ పోరాడేందుకు యువత సిద్ధమవుతోంది, తమ ఉజ్వల భవిష్యత్తు కోసం ఉద్యమించేందుకు సమర శంఖం పూరిస్తోంది. నమ్మించి వంచించిన ప్రభుత్వం, నేతలు యువత ఉద్యమానికి బాసటగా నిలవలేక పోతున్నారు. ప్రస్తుతం హోదాకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం ఉధృతంగా జరుగుతోంది. ముఖ్యంగా హోదాకు మద్దతుగా చేస్తున్న ప్రచారానికి నెగెటివ్ ప్రచారం మొదలైంది. హోదా వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనమేదీ లేదనే ప్రచారం ఇప్పుడు జోరుగా జరుగుతోంది. తమిళ యువత జల్లికట్టు కోసం చేసిన […]