తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దు..!

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో క‌రోనా తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతోంది. ఇలాంటి టైమ్‌లో స్టూడెంట్ల‌కు ఇబ్బందులు రాకుండే ఉండేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే టెన్త్‌, ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ఎగ్జామ్స్‌ను ప్ర‌భుత్వం ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఎప్ప‌టి నుంచో ఇంట‌ర్‌సెకండ్ ఇయ‌ర్ ఎగ్జామ్స్ కూడా ర‌ద్దు చేయాల‌నే డిమాండ్ ఉంది. ఇందుకోసం తెలంగాణ ప్ర‌భుత్వం ఇంటర్ సెకండ్ ఇయ‌ర్ ఎగ్జామ్స్ రద్దు చేసింది. ఈ రోజు ఇందుకు సంబంధించి తాజా ప్రకటన విడుదల […]

కర్ఫ్యూపై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం….!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడి నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు కర్ఫ్యూ నిబంధనలను పొడిగించినట్లు సమాచారం. అందుతున్న సమాచారం మేరకు జూన్ 20 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపోతే 11వ తేదీ నుండి కర్ఫ్యూ వేళలలో కాస్త మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న […]

ఉత్తరప్రదేశ్ లో శవాల ప్రవాహం..కారణం ఏమిటంటే..?

క‌రోనా మ‌ర‌ణ మృదంగం దేశంలో ఏ స్థాయిలో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మ‌రీ ముఖ్యంగా ఉత్త‌ర భార‌త‌దేశంలో దీని తీవ్ర‌త తారా స్థాయిలో ఉంది. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో అయితే క‌రోనా మృత‌దేహాల‌ను క‌న‌నం చేయ‌డానికి ప్లేస్ లేక ఎక్క‌డ బ‌డితే అక్క‌డ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇదే క్ర‌మంలో గంగాన‌ది ఒడ్డున ఇసుక తిన్నెల్లో మృతదేహాల‌ను క‌ప్పిపెడితే అప్ప‌ట్లో ఇవ‌న్నీ న‌దిలోకొట్టుకు రావ‌డం పెద్ద ఎత్తున సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి అదే స్థాయిలో క‌రోనా […]

బ్రేకింగ్: తెలంగాణలో లాక్ డౌన్ పొడగింపు.. !?

సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ప్రగతి భవన్‌ లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా లాక్‎ డౌన్ పొడిగింపుపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అమలులో ఉన్న లాక్ డౌన్ ను పొడగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ ను జూన్ 10 వరకు పొడగించనున్నట్లు సమాచారం అందుతోంది. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు […]

పుష్ప ఐటెం సాంగ్ లో దిశా పటాని…?

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న “పుష్ప” రెండు భాగాలుగా తెరకెక్కుతున్నట్లు ఇటీవల ఆ సినిమా ప్రొడ్యూసర్లు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా స్మగ్లింగ్ నేప‌థ్యంలో రూపొందుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పుష్ప సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఉందట. అయితే ఆ ఐటమ్ సాంగ్ లో […]

బ్రేకింగ్ : ధూళిపాళ్ల న‌రేంద్ర‌కుమార్‌కు బెయిల్..!

గత కొన్ని రోజులకు హాట్ టాపిక్ గా ఉన్న సంగం డెయిరీ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో టీడీపీ సీనియర్‌ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు హైకోర్టులో ఊరట లభించింది. సంగం డెయిరీ కేసులో అరెస్టయిన ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకు కూడా బెయిల్ లభించింది. సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో అవినీతి నిరోధక […]

ఎంపీ రఘురామకృష్ణకు సుప్రీంకోర్టు బెయిల్‌..!?

నరసాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు కస్టడీలో చిత్రహింసలకు గురిచేసినట్టు ముగ్గురు వైద్యుల నివేదిక పేర్కొంది. వైద్య పరీక్షల నివేదికపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరన్.. ఆర్మీ ఆస్పత్రి వైద్య నివేదిక అందినట్టు తెలిపారు. ముగ్గురు వైద్యులు పరీక్షించి ఎక్స్-రే, వీడియో పంపారని అన్నారు. జనరల్ ఎడిమాతోపాటు గాయాలున్నట్టు నివేదికలో పేర్కొన్నారని జస్టిస్ శరన్ వివరించారు. రఘురామ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ, ఆదినారాయణ రావు […]

బ్రేకింగ్ : ఆంధ్ర పరిషత్ ఎన్నికలు రద్దు..!

ఏపీలో వైసీపీకి మరో షాక్ తగిలింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయంలో వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదన్న హైకోర్టు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని వెల్లడించింది. న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి ఈ మేరకు తీర్పును వెలువరించారు. పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు కోడ్‌ విధించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్ర […]

జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం..?

ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతు సంక్షేమం కోసం పని చేస్తున్నామని పేర్కొన్న వైసీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తోంది. రైతుల కోసం మరో అడుగు ముందుకు వేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైయస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం వల్ల రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లు వేయడం ద్వారా సాగునీరు అందించడమే లక్ష్యంగా వైయస్సార్ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏపీలో పేద, […]