ఒక పక్క బాబాయి.. మరో పక్క సొంత బావ! ఇప్పుడు ప్రిన్స్ మహేష్కి పెద్ద అగ్నిపరీక్షగా మారిపొయింది పరిస్థితి. వీరిద్దరూ ఇప్పుడు మహేష్ను చెరోపక్క వాయించేస్తున్నారని సమాచారం. దీనికి కారణం.. ఇద్దరూ చెరో పార్టీ కావడం, ఇద్దరూ మహేష్ మద్దతు కోరుకోవడమే. బాబాయి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, బావ గల్లా జయదేవ్ల వైఖరితో మహేష్ ఇప్పుడు నానాతిప్పలు పడుతున్నాడని అంటున్నారు ఫిలింనగర్ జనాలు. వీరిద్దరూ అధికార, విపక్ష పార్టీలకు చెందిన నేతలు కావడంతో మహేష్ ఇద్దరినీ.. సంతృప్తి పరచలేక […]
Tag: AP
మరో మోసానికి తెరలేపిన బీజేపీ
ప్రత్యేకహోదా అని తర్వాత ప్యాకేజీని ప్రకటించి నమ్మించి మోసగించిన కేంద్రం.. మరోసారి ప్రజల చెవుల్లో పూలు పెట్టేందుకురెడీ అవుతోంది. కేంద్రమంత్రి పదవికి వెంకయ్య రాజీనామా చేసిన తర్వాత.. ఆ స్థానంలో ఎవరిని నియ మించాలనే అంశంపై గట్టిగానే చర్చ జరుగుతోంది. దీనిపై అటు టీడీపీ, ఇటు బీజేపీ కూడా ప్రయత్నాలు తీవ్రతరం చేస్తున్నాయి. మెత్తగా కొట్టి.. నొప్పి తగ్గడానికి ఆయింట్మెంట్ రాసిన చందంగా.. వ్యవహరించాలని బీజేపీ పెద్దలు వ్యూ హాలు రచిస్తున్నారట. ముఖ్యంగా విశాఖకు రైల్వే జోన్ […]
ఏపీ మంత్రి గంటాకు నాన్ బెయిలబుల్ వారెంట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. గంటా 2009 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారనే కేసులో అనకాపల్లి రెండో అదనపు సివిల్ కోర్డు జడ్జి మంత్రికి నాన్బెయిలబుల్ వారెంట్ జారీచేశారు. 2004 ఎన్నికల్లో చోడవరం నుంచి టీడీపీ తరపున గెలిచిన ఆయన 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీలోకి జంప్ చేసి అనకాపల్లిలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. […]
అమరావతిలో ఎమ్మెల్యేల ఇళ్ల సాక్షిగా అదిరే స్కామ్
అవును! ఇప్పుడు అమరావతిలో ఈ మాటే వినబడుతోంది. ప్రభుత్వ నిర్మాణాలను అడ్డు పెట్టుకుని ప్రజల సొమ్మును బొక్కేసేందుకు `కొందరు పెద్దలు` స్కెచ్ గీశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అనేక నిర్మాణాలకు భారీ మొత్తంలో కొటేషన్ వేస్తూ.. మార్జిన్ల రూపంలో డబ్బు దోచేస్తున్నారనే వార్తలు మోతమోగిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు వివిధ సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి పారిందని పెద్ద ఎత్తున విపక్షాలు ఆందోళన చేయడం తెలిసిందే. తాజాగా ఇప్పుడు అమరావతి కట్టడాలపైనా అవినీతి మరకలు అంటుకుంటున్నాయని తెలుస్తోంది. విషయంలోకి […]
ముద్రగడ ముద్ర చెరిగిపోతుందా?!
అవును! కాపు సమాజాన్ని తన జాతి అంటూ భుజాల మీదకి ఎక్కించుకున్న నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. కాపు జాతి కోసం ఆయన ఏం చేయడానికైనా వెనుకాడని నేతగా ఇటీవల కాలంలో భారీగా గుర్తింపు పొందారు. మా కంటూ ఓ నేత ఉన్నాడు అని కాపులు చెప్పుకొనేలా ముద్రగడ ఎదిగిపోయారు. ఈ క్రమంలోనే ఆయన 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు కాపు జాతికి రిజర్వేషన్ కల్పిస్తానని ఇచ్చిన హామీని అమలు చేయాలని పదే పదే డిమాండ్ […]
బాబు ఏరి కోరి తెచ్చుకుంటే బల్లెమవుతున్న మంత్రి!
ఇప్పటికే మంత్రులపై విపరీతమైన ఆరోపణలు.. ఒకరితో ఒకరికి సఖ్యత లేకపోవడం.. ఇలా సీఎం చంద్రబాబుకు మంత్రుల వల్ల తలనొప్పులు తప్పడం లేదు. ఇక తాజాగా మరో మంత్రిపై ఆయనకు ఫిర్యాదులు అందడం.. చర్చనీయాంశంగా మారింది. ఇసుక మాఫియా, డ్రగ్ మాఫియా.. ఇలా ఏపీలో ఆయిల్ మాఫియా కూడా చెలరేగుతోందనే విమర్శలు జోరందుకుం టున్నాయి. అంతేగాక దీనికి ఒక మంత్రి అండగా నిలుస్తున్నారని, కమీషన్లు తీసుకుంటూ దందాలకు పాల్పడుతు న్నారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఈ విషయంపై పారిశ్రామిక […]
ఇద్దరు ఏపీ మంత్రులపై లైంగీక వేధింపుల ఆరోపణలు
అవకాశం వచ్చినప్పుడల్లా బాబు సర్కారుపై ఎక్కేసే వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా.. నిన్న రాఖీ పండగ సందర్భంగా ఓ రేంజ్లో రెచ్చిపోయింది. ఏపీ మంత్రులందరూ కంత్రీలని, టీడీపీ ఎమ్మెల్యేలు కాలకేయుళ్లని భారీ స్తాయిలో విరుచుకుపడింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఇద్దరు మంత్రులకు కామ కోరిక ఎక్కువని సంచలన ప్రకటన చేసింది. వారిద్దరిపైనా లైంగిక వేధింపుల కేసులు కూడా ఉన్నాయని చెప్పింది. రాష్ట్రంలో మహిళలకు పట్టపగలు కూడా నడిచే స్వతంత్రం లేదని, కాల్ మనీ పేరుతో వ్యభిచారంలోకి దింపేశారని ఆరోపించింది. […]
ఆ ఇద్దరు మంత్రులపై వేటు తప్పదా!
నంద్యాల ఉప ఎన్నికల్లో తలమునకలై ఉన్న సీఎం చంద్రబాబుకు ఏపీ మంత్రులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు మధ్య వివాదాలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నా.. అవి ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఉన్న సమస్యలకు తోడు ఇప్పుడు మరో ఇద్దరు మంత్రులు కూడా ఈ జాబితాలో చేరిపోయారట. ఒక మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర విచారణ ఎదుర్కొంటుండగా.. మరొకరు మనీలాండరింగ్ వ్యవహారాలు చక్కదిద్దుకునేందుకు విదేశీటూర్లు చేస్తున్నారట. నంద్యాల […]
ఏపీ బీజేపీలో నిప్పు – ఉప్పు
ఏపీ బీజేపీ వింత పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో బలపడాలని ఒకపక్క పార్టీ అధిష్టానం తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో.. కీలకమైన ఇద్దరు నేతల మధ్య సమన్వయం కొరవడింది. పార్టీని ముందుండి నడిపించాల్సిన నేతలు.. చెరో దారి పట్టారు. ఇందులో ఒకరికి కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడి మద్దతు పూర్తిగా ఉండేది. కానీ ఇప్పుడు ఆయన కూడా ఢిల్లీకే పరిమితమయ్యారు. ఇప్పటివరకూ ఆయన ఆ ఇద్దరు నేతలకూ సర్దిచెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోవడంతో పాటు రాజమండ్రి […]