ఈశ్వరా.. ఇదేమి నిర్ణయం అంటున్న వైసీపీ కార్యకర్తలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా నాయకులు ఏం చేయలేక.. అధినేతను అడగలేక మిన్నకుండిపోయారు. అసలేం జరిగిందంటే.. కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయ పాలక మండలి ఛైర్మన్లను సీఎం ఇటీవల ఎంపిక చేశారు. అయితే వారు స్థానికేతరులు కావడంతో స్థానిక ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. శ్రీకాళహస్తి ఆలయ కమిటీ అధ్యక్షుడిగా సత్యవీడుకు చెందిన బీరేంద్రవర్మ, కాణిపాకం ఆలయ చైర్మెన్ గా చిత్తూరుకు చెందిన ప్రమీళారెడ్డిలను అధినేత ఎంపిక చేశారు. […]

నిజంగానే ప్రత్యేక హోదాపై పోరాటమా.. లేక రాజకీయ నాటకమా..?

రాజ్యసభలో వైసీపీ సభ్యుల ప్రత్యేక హోదా పోరాటం నిజమేనా.. లేక అది రాజకీయ నాటకమా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరి పోరాటం ఎప్పుడో ఒకసారి వచ్చిపోయే అతిథిలా ఉందంటున్నారు విమర్శకులు. ఏపీకి ప్రత్యేక హోదా పోరాటం వల్లే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చింది. అధికారం ఇవ్వండి.. ఢిల్లీలో పోరాడతా అంటూ జగన్ పదే పదే చెప్పడంతో జనం అవకాశమిచ్చారు. అయితే బీజేపీకి జాతీయస్థాయిలో […]

బ్యాట్ పట్టి క్రికెట్ ఆడిన సీఎం జ‌గ‌న్‌..వీడియో వైర‌ల్‌!

ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎప్పుడూ ప్రభుత్వ కార్యకలాపాలు, పార్టీ వ్యవహారాలు, ప్రజా సంబంధ విషయాలతో తలమునకలుగా ఉంటారు. అటువంటి ఆయ‌న‌ తాజాగా బ్యాట్ ప‌ట్టి ఎంతో ఉల్లాసంగా క్రికెట్ ఆడారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..కడప జిల్లా పర్యటనలో భాగంగా తన తాతగారైన వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంను శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సందర్శించారు.స్టేడియంలో అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం సరదాగా స్టేడియంలో క్రికెట్‌ […]

టీడీపీకి బిగ్ షాక్‌..పార్టీని వీడ‌నున్న ప‌న‌బాక ల‌క్ష్మి?!

తెలుగు దేశం పార్టీకి, అధినేత నారా చంద్ర‌బాబు నాయుడికి మ‌రో బిగ్ షాక్ త‌గ‌ల‌నుంది. మాజీ మంత్రి పన‌బాక లక్ష్మి టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ ఉన్నార‌న్న వార్త‌లు ప్ర‌స్తుతం ఊపందుకున్నాయి. పన‌బాక లక్ష్మి భర్త పన‌బాక కృష్ణయ్య కూడా ఆమెనే అనుసరిస్తార‌ని స‌మాచారం. గత ఎన్నికల్లో టీడీపీ తరపున తిరుపతి లోక్‌సభ స్థానానికి పోటీచేసిన ప‌న‌బాక ల‌క్ష్మి.. ఘోర ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. ఇక‌ ఓడిపోయిన‌ప్ప‌టి నుంచి ఆమె పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా […]

ఏపీ రాజ‌కీయాల్లోకి వంట‌ల‌క్క‌..ఏ పార్టీ అంటే?

కార్తీకదీపం సీరియల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ పాపుల‌ర్ అయిన వంట‌ల‌క్క గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వంట‌ల‌క్క‌ అస‌లు పేరు ప్రేమీ విశ్వనాథ్. ఒకే ఒక్క సీరియల్‌తో ఎనలేని క్రేజ్‌ను అందుకున్న ఈ భామ.. త్వ‌ర‌లోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాబోతోంద‌ట‌. ఈ విష‌యం స్వ‌యంగా వంట‌ల‌క్కే తెలిపింది. తాజాగా త‌న యూట్యూబ్ ఛానెల్‌లో కార్తీక దీపం షూటింగ్ స్పాట్‌లో చేసిన ఓ వీడియో పోస్ట్ చేసింది వంట‌ల‌క్క‌. ఈ వీడియోలో కార్తీకదీపం సీరియల్ నిర్మాతతో […]

ఆ మాజీ మంత్రి మ‌ళ్లీ టీడీపీలోకి రివ‌ర్స్ జంప్ ?

రాజ‌కీయాలు ఎలాగైనా మారిపోవ‌చ్చు. ఏపార్టీకి ఎవ‌రూ శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌ని అంటారు. పార్టీ మారేవారు.. ఎప్పుడు ఎటు అవ‌కాశం ఉంటే.. అటు మారిపోతూ ఉంటారు. పార్టీలు కూడా త‌మ‌కు అనుకూలంగా ఉండే నేత‌ల‌కు ప‌ట్టం క‌ట్టేందుకు ప్రాధాన్యం ఇస్తుంటాయి. సో.. నాయ‌కులు కూడా ఎప్పుడైనా పార్టీ మారిపోవ‌చ్చ‌నే ధీమాలో ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఇలానే చేసేందుకు ప్ర‌కాశం జిల్లా చీరాల‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి పాలేటి రామారావు ప్ర‌య‌త్నిస్తున్నా ర‌ని […]

తిరుప‌తి ఉప ఎన్నిక‌..పోస్టల్ బ్యాలెట్ లో వైఎస్ఆర్‌సీపీ ఆధిక్యం!

తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి గత నెలలో జ‌రిగిన ఉప ఎన్నిక ఫ‌లితాలు నేడు రానున్న సంగ‌తి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ వైసీపీది ఘన విజయం అని చెప్పినా.. టీడీపీ, బీజేపీ అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్ర‌జ‌లంతా ఎంతో ఉత్కంఠ‌గా ఫ‌లితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక నేటి ఉద‌యం 8 గంట‌ల‌కు కౌంటింగ్ ప్రారంభం అయింది. తిరుపతి లోక్‌సభ నియో జకవర్గం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉండటంతో రెండు చోట్ల […]

తిరుపతి ఉప ఎన్నిక..షురూ అయిన కౌంటింగ్‌!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన తిరుపతి ఉపఎన్నికల ఫ‌లితాలు ఈ రోజే వెలువ‌డ‌నున్నాయి. కొద్ది సేప‌టి క్రిత‌మే కౌంటింగ్ షురూ అయింది. నెల్లూరు, తిరుపతిలో ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు. మొత్తం 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కరోనా నిబంధనలను పాటిస్తూ ఈ ప్రక్రియను నిర్వహిస్తామని.. సాధ్యమైనంత తక్కువ మందిని మాత్రమే కౌంటింగ్ హాల్ లోకి అనుమతిస్తామని ఈసీ ఇప్పటికే పేర్కొంది. అందుకే అనుగుణంగానే […]

టీడీపీలో మ‌రో విషాదం..క‌రోనాతో విశాఖ కార్పొరేటర్ మృతి!

ప్రాణాంత‌క వైర‌స్ అయిన క‌రోనా త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. మ‌ళ్లీ వికృత రూపం దాల్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఎన్నో లక్ష‌ల మందిని బ‌లి తీసుకున్న ఈ క‌రోనా.. ప్ర‌స్తుతం మ‌రింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు ఇలా అంద‌రిపై క‌రోనా పంజా విసురుతోంది. తాజాగా విశాఖలో కరోనా బారినపడి మరో కార్పొరేటర్ కన్నుమూశారు. ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ తరఫున 31వ వార్డు కార్పొరేటర్‌గా ఎన్నికైన వానపల్లి రవికుమార్ గ‌త […]