ఆగస్టు 8న జిఎస్‌టి బిల్లుపై లోక్‌సభలో చర్చ

లోక్‌సభలో సోమవారం జిఎస్‌టి బిల్లుపై చర్చ చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. అలాగే ప్రధాని ప్రమేయంతో వివిధ రాష్ట్రాల్లోని శాసన సభల్లో కూడా దినికి ఆమోదం లభించేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాగా సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టబోయే ఈ బిల్లుకు ఆమోదం ఆరోజే ఆమోదం పొందుతుందని భావిస్తున్నామని ఒక సీనియర్ కేంద్ర మంత్రి చెప్పారు. అలాగే ఆరోజు జిఎస్‌టి బిల్లుపై ప్రధాని మోడీ చర్చను ప్రారంభిస్తారని తెలిపారు. కాగా ఇప్పటికే రాజ్యసభలో జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందిన విషయం విదితమే! […]

ఇంకా ఆశల పల్లకిలోనే ప్రత్యేక హోదా

ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే విషయమై కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ వైఖరి తేలిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, టిడిపి ఎంపిల సమావేశంలో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడి ఎటువంటి హామీని ఇవ్వలేదని సమాచారం. దాంతో ఏపికి ప్రత్యేకహోదా రాదన్న విషయం మరోసారి స్పష్టమైపోయింది. జాతీయ పార్టీలన్నీ రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ స్పష్టంగా చెప్పినా భాజపా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, టిడిపి ఎంపిలు విడివిడిగా ప్రధానమంత్రిని కలిసి మాట్లాడిన తర్వాత కూడా హోదాకు కమలనాధులు సానుకూలంగా స్పందిచాలని […]

టి బీజేపికి నరేంద్రుడు షాకిస్తారా…

తెలంగాణ‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఎద‌గాల‌ని చూస్తున్న బీజేపీకి గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. తామొక‌టి త‌లిస్తే….కేంద్రంలోని పెద్దలు మ‌రొక‌టి త‌లుస్తున్నార‌ని తెలంగాణ క‌మ‌ళ‌నాథులు తెగ ఫీల‌యిపోతున్నారు. ఈ అసంతృప్తి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ విష‌యంలో కూడా కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. 7న తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి ప్ర‌ధాన‌మంత్రి రానున్న విషయం తెలిసిందే. ఒకేరోజులో అటు ప్రభుత్వ కార్యక్రమాల్లో, ఇటు పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్రప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో జరిగే సభలో […]

మోదుగల హర్ట్ అయ్యార్ట…

రాజ‌కీయాలన్నాక నేత‌లు అల‌గ‌డం, వారిని అధిష్టానం బుజ్జగించ‌డం మామూలే. ఏపీ అధికార పార్టీ టీడీపీలోనూ అలిగే వారి సంఖ్య ఇటీవ‌ల కాలంలో ఎక్కువ‌గానే క‌నిపిస్తోంది. తాజాగా.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి టీడీపీ అధిష్టానంపై అలిగారు. పార్టీలో త‌న‌మాటకు విలువ లేకుండా పోయింద‌ని, త‌న‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదని తెగ ఫీలైపోతున్నారు. ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా ఉన్న హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సర్ది చెప్పినా మోదుగుల దిగిరాలేద‌ని స‌మాచారం. మ‌రి అంత‌గా ఆయ‌న అల‌గ‌డానికి […]

గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ

గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ అనూహ్యంగా ఎంపికయ్యారు. చివరి క్షణం వరకు నితిన్ భాయ్ పటేల్ అవుతారని ప్రచారం జరిగినా…పార్టీ కేంద్ర పరిశీలక బృదం రూపానీనే ఎంపిక చేసింది. బీజేపీ శాసన సభ్యులతో అమిత్ షా, నితిన్ గడ్కరీ, దేశ్ పాండేలతో కూడిన పరిశీలక బృందం చర్చించింది. మెజార్టీ సభ్యులు రూపానీ నాయకత్వం వైపే మొగ్గుచూపారు. పటేల్ సామాజిక వర్గానికి చెందిన నితిన్ ఎంపిక చేస్తారనే ప్రచారం ఇవాళ్టితో ముగిసిపోయింది. జైన్ అయిన విజయ్ ఒకప్పుడు […]

w/o మోడీ కిరానా షాప్ లోనా!

కిరాణా దుకాణం నడుపుతున్న ఈ పెద్దమనిషి ఎవరో గుర్తుపట్టారా..? ప్రధాని మోడీ సతీమణి యశోదబెన్. ఆ కిరాణా షాపులో ఆమె ఏం చేస్తున్నారా అనుకుంటున్నారా..? టీచర్ గా పని చేస్తున్నారని అన్నారు కదా.. ఇదేంటి ఇలా షాపులో పని చేస్తున్నారు.. ఎంత కష్టమొచ్చింది అనుకుంటున్నారా..? ఆగండాగండి.. ఒక్క క్షణం. ప్రస్తుతం గుజరాత్ లోని ఉంజా గ్రామంలో ఉంటున్న యశోదాబెన్.. తన తమ్ముడి ఇంట్లో ఉంటున్నారు. ఈ షాపు అతనిదే. ఖాళీ సమయాల్లో ఇదిగో ఇలా కిరాణా సామాను […]

150 రూపాయిలకు రేప్ వీడియో!

ఉత్తరప్రదేశ్ లో అత్యాచార ఘటనలకు సంబంధించిన వీడియోలు మార్కెట్లో కి సైతం వచ్చేశాయి. హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. ఒక్కొక్కటీ యాభై రూపాయల నుంచి 150 రూపాయల దాకా అమ్ముతున్నారు. అది ఓ సీడీ రూపంలో ఉండదు. కావాల్సిన వారు ఆ షాపులకు వెళితే స్మార్ట్ ఫోన్లలోనో లేక పెన్ డ్రైవ్ లోనో వేస్తారు. నిడివి బట్టి, స్పష్టత బట్టి రేటు. ‘ఇవి రియల్ లైఫ్ క్రైమ్ ఘటనలు.. వీటిలో మజా ఉంటుందని ఎక్కువ మంది యువకులు […]

ఓ స్త్రీ రేపు రా!

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశం ‘ఓ స్త్రీ రేపు రా’ అన్నట్లుగానే ఉంది. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వలేం అని చెబుతూనే ‘ఇంకా ఉంది’ అని చెబుతూ కేంద్రం తాత్సారం చేస్తుంది గనుక. ఇచ్చేది లేదని చెప్పిన తరువాత అదే మాటకు కట్టుబడి ఉండాలి. అయితే ఆంధ్రప్రదేశ్‌ నుంచి పెరుగుతున్న ఒత్తిడితో ‘పరిశీలిస్తున్నాం’ అనే మాట చెబుతున్నారు. ఆ పండగ, ఈ పండగ అన్నారు. అన్నీ వెళ్ళిపోయినయ్‌. అమరావతి శంకుస్థాపన వేదికపై నరేంద్రమోడీ ప్రకటిస్తారనే ప్రచారం జరుగగా […]

డ్యామిట్‌, ఇలా ఎందుకయ్యింది?

తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌, హైకోర్టులో నేడు తమ ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలు కొట్టివేయడం పట్ల అసహనంతో ఉన్నారని సమాచారమ్‌. ఏ ప్రభుత్వమైనా హైకోర్టు నుంచి ఇలాంటి పరిస్థితులు ఎదురయినప్పుడు షాక్‌కి గురవడం మామూలే. పాలనా పరంగా తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి వివాదాస్పదమవుతుంది. న్యాయస్థానాల జోక్యంతో తాము జారీ చేసిన జీవోలని వెనక్కి తీసుకోవడం, సవరించుకోవడం మామూలే. అయినప్పటికీ తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా వేలాది, లక్షలాది ఎకరాలకు నీళ్ళు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న తమ […]