తూర్పు గోదావ‌రికి ఐదుగురు కొత్త ఎమ్మెల్యేలు..!

ఏపీలో అధికారం ద‌క్కించుకునేందుకు కీల‌కమైన జిల్లాల్లో తూర్పు గోదావ‌రి జిల్లా ఒక‌టి. ఏపీలోని 13 జిల్లాల్లో తూర్పు గోదావ‌రి జిల్లాలోనే ఎక్కువ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. 19 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఈ జిల్లా నుంచి ప్రాథినిత్యం వ‌హిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో మూడు ఎంపీ సీట్లు, మెజార్టీ ఎమ్మెల్యే సీట్లు టీడీపీ గెలిచి అధికారంలోకి వ‌చ్చింది. ఇక 2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌కు ముందు తూర్పు గోదావ‌రిలో 21 అసెంబ్లీ సీట్లు ఉండ‌గా పునర్విభ‌జ‌న‌లో రెండు కోల్పోవాల్సి […]

జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు పోటీగా ప‌వ‌న్ ర‌థ‌యాత్ర‌

2019 ఎన్నిక‌ల‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ రెడీ అవుతున్నాడు. ఇప్ప‌టికే జ‌న‌సేన వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీ, తెలంగాణ‌లో పోటీ చేస్తుంద‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించాడు. ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని చెప్పిన‌ ప‌వ‌న్ ప్ర‌జాక్షేత్రంలోకి దిగ‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ప‌వ‌న్ పార్టీ ఇంకా క్షేత్ర‌స్థాయిలోనే బ‌లోపేతం కాలేద‌ని, మ‌రి ఈ టైంలో ప‌వ‌న్ ఎన్నిక‌ల‌కు ఎలా వెళ‌తాడు ? అన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఇక పవ‌న్ ఎట్ట‌కేల‌కు పార్ట్ టైం పొలిటిషీయ‌న్ అన్న విమ‌ర్శ‌లు రాకుండా ఫుల్ టైం […]

ఆ ముగ్గురు చూపు టీడీపీ వైపు…

ఒక‌ప్పుడు ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నాయకులు దాడి వీరభద్రరావు – కొణతాల రామకృష్ణ – సబ్బం హరి చాలా కాలంగా తెరవెనక్కు వెళ్లిపోయారు. ఒక‌ప్పుడు ఈ ముగ్గురు సీనియ‌ర్లు ఓ రేంజ్‌లో రాజ‌కీయాల్లో రాణించారు. ఇప్పుడు వీరి వాయ‌స్ ఎక్క‌డా విన‌ప‌డ‌డం లేదు. టీడీపీలో సీనియ‌ర్ నాయకుడు అయిన దాడి వీర‌భ‌ద్ర‌రావు త‌ర్వాత వైసీపీలో చేరారు.  దాడి తన‌యుడు ర‌త్నాక‌ర్ వైసీపీ నుంచి విశాఖ న‌గ‌రంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. త‌ర్వాత […]

నంద్యాల‌పై చంద్ర‌బాబుకు తేడా కొడుతుందా..!

ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం చంద్ర‌బాబుకు నంద్యాల‌పై ఎక్క‌డా లేని ప్రేమ పుట్టుకొచ్చేస్తోంది. నంద్యాల‌లో అధికార పార్టీగా ఉన్న టీడీపీకి ఇక్క‌డ గెలుపు అంత వీజీ కాద‌ని రిపోర్టులు చెపుతోన్న నేప‌థ్యంలో చంద్రబాబుకు చిరు చెమ‌ట‌లు ప‌ట్టేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు అక్క‌డ కులాల వారీగా నేత‌ల‌ను దింపుతున్నారు. ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న చంద్రబాబునాయుడి ఆదేశాలతో నంద్యాలపై నిధులు కుమ్మరిస్తున్నారు. మొన్నటి వరకు నంద్యాల అభివృద్ధికి పెద్దగా నిధులు […]

టీడీపీలో జ‌గ‌న్ కోవ‌ర్టులు ఎవరు..!

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల క‌ద‌లిక‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు ఓ క‌న్నేసి ఉంచాలి. అక్క‌డ వారు ఏం చేస్తున్నారో తెలుసుకుని వెంట‌నే మ‌నం దానికి మించిన స్టెప్ వేయాలి ? అప్పుడే ఇక్క‌డ స‌క్సెస్ ఉంటుంది. అన్ని పార్టీల వాళ్ల‌కు ఇత‌ర పార్టీల్లో ఏం జ‌రుగుతుందో తెలుసుకునేందుకు కొంద‌రు వేగులు /  కోవ‌ర్టులు ఉంటుంటారు. ఈ క్ర‌మంలోనే టీడీపీలోని ఇంటి గుట్టును ప్ర‌త్య‌ర్థి వైసీపీకి అంద చేస్తోన్న వారితో ఇప్పుడు చంద్ర‌బాబుకు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుంద‌ట‌.  వ‌రుస‌గా అభివృద్ధి ప‌థ‌కాలు అమ‌లు […]

కొడాలి నాని పొలిటిక‌ల్ రూటు మారుతోందా..!

కృష్ణా జిల్లా గుడివాడ‌లో గ‌త ద‌శాబ్దంన్న‌ర‌గా తిరుగులేని రాజ‌కీయాలు చేస్తూ గుడివాడ ఫైర్‌బ్రాండ్‌గా మారిపోయాడు కొడాలి నాని. పార్టీ ఏదైనా ఆయ‌న మాత్రం వ‌రుస‌గా ఎమ్మెల్యేగా గెలుస్తూనూ ఉన్నాడు. నాని గెలిచిన ప్ర‌తిసారి ఆయ‌న పార్టీ అధికారంలోకి రావ‌డం లేదు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నో ఇబ్బందుల్లో ఉంటున్నాడు…అయినా గెలుపు మాత్రం ఆయ‌న‌దే. దివంగ‌త మాజీ సీఎం ఎన్టీఆర్ గ‌తంలో ప్రాథినిత్యం వ‌హించిన గుడివాడ ఒక‌ప్పుడు టీడీపీకి కంచుకోట‌. అలాంటిది ఇప్పుడు నానిని కంచుకోట‌గా మారింది. ఇదిలా ఉంటే 2004, […]

కోడెల‌కు 2019లో గెలుపు భ‌యం ప‌ట్టుకుందా..!

రాజ‌కీయాల్లో బండ్లు ఓడ‌లు – ఓడ‌లు బండ్లు అవ్వ‌డం కామ‌న్‌. ఆ మాట‌కు వ‌స్తే ఈ నానుడి ఒక్క రాకీయాల‌కే కాదు..ఏ రంగానికి అయినా వ‌ర్తిస్తుంది. ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు పేరు చెపితే తెలుగు రాజ‌కీయాల్లో కాక‌లు తీరిన  రాజ‌కీయ నేత‌ల్లో ఆయ‌న కూడా ఒక‌రు. గుంటూరు జిల్లా న‌ర‌సారావుపేట నుంచి 1983 నుంచి వ‌రుస‌గా తిరుగులేని విజ‌యాలు సాధించిన ఆయ‌న కాంగ్రెస్ పాల‌న‌లో బాగా వెన‌క‌ప‌డిపోయారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రెండు సార్లు […]

టీడీపీలోకి మ‌రో వైసీపీ ఎంపీ..రంగం సిద్ధం !

ఏపీలో విప‌క్ష వైసీపీకి ప్లీన‌రి త‌ర్వాత ఎక్క‌డా లేని జోష్ వ‌చ్చేసింది. కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగి ఖాళీగా ఉంటోన్న వాళ్లు, ఇత‌ర సీనియ‌ర్ నాయ‌కులు త‌మ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ కోసం వైసీపీలో చేరితే ఎలా ఉంటుందా ? అన్న ఆలోచ‌న చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే వైసీపీ బ‌లంగా ఉన్న క‌ర్నూలు జిల్లాలో ప‌ట్టున్న మాజీ సీఎం కోట్ల విజ‌య్‌భాస్క‌ర్‌రెడ్డి ఫ్యామిలీ వైసీపీలో చేరుతుంద‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతానికి కాంగ్రెస్‌లో ఉన్న కోట్ల త‌న […]

మ‌హిళా సాధికార‌త‌లో బాబు వెనుక‌డుగే

మ‌హిళా సాధికార‌త‌, మ‌హిళ‌ల రిజ‌ర్వేష‌న్ల‌కు ఎప్పుడూ క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతుంటారు. మొన్న‌టికి మొన్న ఉమెన్స్ పార్ల‌మెంట్ ఘ‌నంగా నిర్వహించి.. మ‌హిళ‌ల‌కు అత్యంత గౌర‌వం ఇస్తున్నామ‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.ఇదంతా నాణేనికి ఒక‌వైపు! మ‌రోవైపు.. సొంత పార్టీ ఎమ్మెల్యే మ‌హిళా అధికారిపై చేయిచేసుకున్నా.. సొంత పార్టీ ఎమ్మెల్యేను వెన‌కేసుకొచ్చారు త‌ప్ప‌.. ఆమెకు క్ష‌మాప‌ణ‌లే చెప్పించ‌లేదు. కానీ ఇప్పుడు ఒక మ‌హిళా అధికారిణితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన ఎమ్మెల్యేతో.. ఆమెకు క్ష‌మాప‌ణ‌లు చెప్పించి.. తెలంగాణ సీఎం […]