కరోనా కరాళ నృత్యం చేస్తోంది. తెలుగు రాష్ట్రాలను మహమ్మారి పట్టి పీడిస్తుంది. రోజు రోజుకు కరోనా కేసులు ఎక్కువవడంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నైట్ కర్ప్యూ పెట్టిన విషయం తెల్సిందే. రైలు, బస్సు వేళలను కూడా మార్చారు. అన్ని రంగాలు కూడా తమ పనివేళలను కుదించుకున్నాయి. అందుల భాగంగా తాజాగా బ్యాంకింగ్ రంగంలోనూ పనివేళలు కుదిస్తున్నట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రకటించింది. కరోనాను కట్టడి చేసే చర్యల్లో భాగంగా బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం […]
Category: Latest News
వైరల్ : అక్కడ వింత శిశువు జననం..!?
ఒడిశాలో మరో వింత శిశువు జన్మించింది. ఒక మహిళ పంది తలను పోలిన తల, చేప చర్మాన్ని పోలిన చర్మంతో ఉన్న వింత శిశువుకు జన్మ ఇచ్చింది. ఒడిశా రాష్ట్రం గంజామ్ జిల్లా బెర్హంపూర్లోని ఓ ఆస్పత్రిలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.బెర్హంపూర్ పట్టణ సమీపంలోని బట్టకుమార గ్రామానికి చెందిన ఓ 30 ఏండ్ల మహిళ 8 నెలల గర్భిణి. అయితే గురువారం రాత్రి ఆమెకు నొప్పులు రావడంతో బెర్హంపూర్లోని మెడికల్ కాలేజ్ అండ్ […]
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ కీలక నిర్ణయం యుద్ధ విమానాల్లో..
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రాణవాయువు (ఆక్సిజన్) కొరతతో దేశవ్యాప్తంగా వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ పేషెంట్ల బాధలు చెప్పలేనివి కావు. మునుపెన్నడూ చూడని విధంగా దేశంలో రోజుకు 1500 కు మించి మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో కొద్దిరోజులుగా ఈ తరహా మరణాలు పెరుగుతున్న తరుణంలో ఆక్సిజన్కు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల నుంచి టన్నుల కొద్దీ వాయువును ఆస్పత్రులకు తరలిస్తున్నా అదీ సరిపోవడం లేదు. యుద్ధప్రాతిపదిక ఆక్సిజన్ తరలింపునకు చర్యలు చేపడుతున్నారు. అందులో […]
రెండు నిమిషాల్లో కరోనా రిజల్ట్..ఇందులో నిజమెంతంటే..?
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో టెస్ట్ లు కూడా భారీ సంఖ్యలో చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం చేస్తున్న పరీక్షలు అన్ని ఖర్చుతో కూడుకున్నవే. ఇంకా రిజల్ట్ వచ్చేందుకు కొంత సమయం కూడా పడుతుంది. ఈ లోపు కొంత మందికి అయినా కరోనా సోకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రెండు నిముషాల్లో కరోనా రిజల్ట్ చెప్పే పరీక్షను కనిపెట్టారు. బ్లడ్ శాంపిల్స్ తీసుకోకుండా రెండు నిమిషాల్లో కరోనా ను […]
మరో రేర్ ఫీట్ అందుకున్న బుట్టబొమ్మ..ఫొటో వైరల్!
పూజా హెగ్డే.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ముకుంద` సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన పూజా.. అల్లు అర్జున్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమాతో హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు వెల్లువెత్తడంతో పాటు సూపర్ హిట్లు కూడా బాగానే పడ్డాయి. దీంతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది ఈ బుట్టబొమ్మ. ప్రస్తుతం తెలుగులో ఆచార్య, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, తమిళంలో విజయ్ సరసన […]
100 మిలియన్ లిస్టులో అల్లు అర్జున్ సినిమా..!?
టాలీవుడ్ స్టైలిష్ హీరో అల్లు అర్జున్ సినిమాలకు కానీ తన వీడియోస్ కి చాలా రికార్డులు ఉన్నాయి. అప్పుడు నటించిన సరైనోడు నుంచి లేటెస్ట్ అల వైకుంఠపురములో, పుష్ప వరకు అల్లు అర్జున్ ఖాతాలో అనేక రికార్డులు ఉన్నాయి. కానీ ఇప్పుడు తాజాగా తెలుగులో ఒక కొత్త రికార్డును బన్నీ తన అకౌంట్ లో వేసుకున్నాడు. తాను హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ డీజే దువ్వాడ జగన్నాధం. హిందీలో […]
రాజమౌళి ఇచ్చిన బంపర్ ఆఫర్కు నో చెప్పిన ప్రభాస్!
దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి అంటే తెలియని వారుండరు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో డైరెక్టర్గా తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈయన..అపజయమే లేకుండా వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. మగధీర చిత్రంతో దర్శకధీరుడిగా పేరు దక్కించుకున్న ఈ జక్కన్న.. బాహుబలి చిత్రంతో భారతదేశంలోనే నంబర్ వన్ డైరెక్టర్గా ప్రఖ్యాత పొందారు. అందుకే ఈయనతో సినిమా చేసేందుకు ఎందరో తారలు పోటీ పడుతుంటారు. జక్కన్న సినిమాలో చిన్న పాత్ర వచ్చినా చాలనుకునే వారు ఎందరో. కానీ, కొందరు తారలు […]
కరోనా కల్లోలం..ప్రముఖ సంగీత దర్శకుడు మృతి!
ఎక్కడో చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ప్రపంచదేశాలకు పాకేసి అల్లకల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మునపటితో పోలిస్తే ప్రస్తుతం మరింత వేగంగా కరోనా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే ఎందరో కరోనా బారిన పడుతుండగా.. కొందరు ప్రాణాలను ఊడా కోల్పోతున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు శ్రావణ్ రాథోడ్ కరోనాతో మృతి చెందారు. ఈయన వయసు 66 సంవత్సరాలు. ఇటీవల శ్రావణ్కు కరోనా సోకగా.. ముంబైలోని ఎల్ఎల్ రహేజా ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స తీసుకుంటున్నప్పటికీ.. […]
బ్రేకింగ్: కరోనా బారిన పడ్డ మంత్రి కేటీఆర్!
కంటి కనిపించకుండా ముప్ప తిప్పలు పెడుతున్న కరోనా సెకెండ్ వేవ్లో ఎంత వేగంగా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్యులు, సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, క్రీడా కారులు అనే తేడా లేకుండా ఈ మహమ్మారి అందరిపై పంజా విసురుతోంది. తాజాగా తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో తాజాగా కేటీఆర్ కరోనా టెస్ట్ చేయించుకోగా.. అందులో ఆయనకు పాజిటివ్గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా […]