మే 5 నుంచి లాక్‌డౌన్‌..ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం!

క‌రోనా వైర‌స్‌.. ప్ర‌స్తుతం దేశంలో ఎక్క‌డ చూసినా మ‌ళ్లీ ఈ మ‌హ‌మ్మారి పేరే వినిపిస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ ప్రాణాంత‌క వైర‌స్‌ ప్ర‌జ‌ల‌ను, ప్ర‌భుత్వాల‌ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు కోల్పోగా.. ఇంకెంద‌రో హాస్ప‌ట‌ల్‌లో చికిత్స పొందుతున్నారు. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా కొన‌సాగుతున్నా.. క‌రోనా వైగంలో జోరు త‌గ్గ‌డం లేదు. దీంతో చేసేదేమి లేక ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నారు. తాజాగా ఒడిశా ప్ర‌భుత్వం కూడా […]

అభిమానుల‌కు మ‌హేశ్ డ‌బుల్ ద‌మాఖా..!

ప్రిన్స్ మ‌హేశ్‌బాబు అభిమానుల‌కు పండ‌గ‌లాంటి వార్త ఇది. కోవిడ్ కారణంగా దాదాపు రెండేళ్ల పాటు సూపర్‌స్టార్ను వెండితెర మీద చూడ లేక‌పోయిన ప్రేక్ష‌కుల‌కు ఆ గ్యాప్‌ని భర్తీ చేస్తూ ఒకేసారి డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాడు. గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన మహేష్ కరోనా వల్ల ఈ ఏడాది ఏ సినిమాను విడుదల చేయలేకపోయాడు. దీంతో దాదాపు రెండేళ్ళ గ్యాప్‌ను వ‌చ్చింది. అభిమానుల‌కు ఆ లోటును భ‌ర్తీ చేసేందుకు మ‌హేశ్ దృష్టి సారించారు. […]

బెంగాల్‌లో ఓవైసీ పార్టీకి ఝ‌ల‌క్‌..!

పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ విజ‌యం దిశ‌గా దూసుకుపోతున్న‌ది. బీజేపీ పోటీ ఇచ్చినా మెజార్టీ సాధించ‌లేక‌పోతున్న‌ది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాల‌కు గాను 292 స్థానాల‌కు ఎనిమిది విడ‌త‌ల్లో ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించింది. ఈ రాష్ట్రంలో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 184 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 98 సీట్లలో లీడింగ్ లో ఉంది. క్షణ క్షణానికీ లెక్కలు మారుతున్నాయి. ఇక నందిగ్రామ్ నియోజకవర్గంలో మొదట మమత ఆధిక్యంలో ఉన్నట్టు కనబడినా […]

అందుకోసం సొంత బైకును అమ్ముకున్న ఫిదా ఫేం..?

వరుణ్‌తేజ్‌, సాయి పల్లవి జంటగా నటించిన ఫిదా సినిమాలో హర్షవర్ధన్‌ ఓ ముఖ్యపాత్రలో నటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు తకిట తకిట, నా ఇష్టం, కవచం వంటి పలు సినిమాలు చేశాడు. బాలీవుడ్‌లోనూ సనమ్‌ తేరీ కసమ్‌ వంటి అడపాదడపా చిత్రాల్లో నటించాడు. ఇటీవలే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ 5లో రిలీజైన తైష్‌ సినిమాలోనూ కనిపించాడు. తాజాగా ఆయనను పలువురు ప్రసంశిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు. […]

సాగ‌ర్‌లో విజ‌యం దిశ‌గా టీఆర్ ఎస్‌..!

న‌ల్గొండ జిల్లా నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ దిశ‌గా దూసుకెళ్తుంది. విజ‌యం దిశ‌గా ప‌య‌నిస్తున్న‌ది. కారు దూకుడుకు విప‌క్షాలు బెంబేలెత్తుతున్నాయి. రౌండ్ రౌండ్‌లోనూ గులాబీ స్ప‌ష్ట‌మైన ఆధిక్య‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తున్న‌ది, టీఆర్ ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ విజ‌యం ఖాయ‌మైన‌ట్లుగా తెలుస్తున్న‌ది. వ‌రుస‌గా తొలి ఎనిమిది రౌండ్ల‌లోనూ టీఆర్ఎస్ అభ్య‌ర్థి మంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రిచారు. ఏడో రౌండ్ ముగిసే స‌రికి 6,592 ఓట్ల‌ మెజార్టీతో నోముల భ‌గ‌త్‌ ముందంజ‌లో ఉన్నారు. ఎనిమిదో […]

ఓట‌మి దిశ‌గా కేంద్ర మంత్రి.. 200 ఆధిక్యంలో డిప్యూటీ సీఎం

ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగుతున్నాయి. మ‌హ‌మ‌హులు ఓట‌మి దిశ‌గా ప‌య‌నిస్తున్నారు. ఇప్ప‌టికే టీఎంసీ పార్టీ ప్ర‌భుత్వాన్ని చేప‌ట్టేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగ‌ర్‌ను దాటేసింది. మొత్తంగా 161 స్థానాల్లో ముందంజ‌లో ఉన్న‌ది. బీజేపీ 118 స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతున్న‌ది. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు లెక్కించిన ఓట్ల‌లో మొత్తంగా టీఎంసీ 51శాతం సాధించ‌గా, 35శాతం ఓట్ల‌ను మాత్ర‌మే సాధించ‌డం గ‌మ‌నార్హం. ఇదిలా సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో బీజేపీ అభ్య‌ర్థి సువేందు అధికారి దూసుకెళ్తున్నారు. మూడు […]

తీవ్ర విషాదంలో విజయదేవరకొండ …!?

టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండకు ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. వరుస హిట్లతో టాలీవుడ్‌ను షేక్ చేశారు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా అంటూ అలా దూసుకుపోతూనే వచ్చారు. మధ్యలో ఫ్లాపులు పలకరించినా కూడా ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. అలా విజయ్ దేవరకొండకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ దక్కింది. సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ విజయ్‌ను ఇష్టపడేవారెంతో మంది ఉన్నారు. విజయ్ దేవరకొండ స్టైల్, యాష, బాష, మాట్లాడే తీరు, కనిపించే […]

అగ్ర‌న‌టులు ముంద‌జ‌.. ఖుష్బూ వెనుకంజ‌

ఎప్పటిలాగే ఈ ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. డీఎంకే కూటమిలో కాంగ్రెస్, ఎండీఎంకే, వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు పోటీ చేయ‌గా, అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ, పీఎంకే, తమాక తదితర పార్టీలున్నాయి. వాటితోపాటు మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ కూటమిలో ఐజేకే, సమక చేరాయి. అయితే శరత్‌కుమార్‌ అధ్యక్షుడిగా ఉన్న సమక నుంచి ఎవ్వరూ పోటీచేయలేదు. అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ సారథ్యంలోని కూటమి […]

సాగ‌ర్ నాల్గవ రౌండ్ లో ఎవరు టాప్ అంటే..?

నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ దూసుకుపోతున్నారు. వ‌రుస‌గా తొలి నాలుగు రౌండ్ల‌లోనూ టీఆర్ఎస్ అభ్య‌ర్థి మంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రిచారు. నాలుగో రౌండ్ ముగిసే స‌రికి 3,457 ఓట్ల‌ మెజార్టీతో నోముల భ‌గ‌త్‌ ముందంజ‌లో ఉన్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్య‌ధిక ఓట్లు వ‌చ్చాయి. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్‌కు 4,228 ఓట్లు, కాంగ్రెస్ అభ్య‌ర్థి జానారెడ్డికి 2,753 ఓట్లు పోల‌య్యాయి. మూడో రౌండ్‌లో టీఆర్ఎస్ పార్టీకి 3421, […]