తన రథయాత్రతో బీజేపీకి పూర్వవైభవం తీసుకొచ్చిన కురువృద్ధుడు, ఎంపీ ఎల్కే అద్వానికి.. ఇప్పుడు ఏ పదవి దక్కుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. గత ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా తనను ఎంపిక చేస్తారని ఆశలు పెట్టుకున్న ఆయనకు.. మోడీ రూపంలో ఊహించని షాక్ తగిలింది. అప్పటి నుంచి మోడీ-అద్వానీ మధ్య ఇంటర్నల్ వార్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆయన్ను రాష్ట్రపతిని చేసి సముచిత గౌరవం ఇవ్వాలని చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అద్వానీ కూడా మళ్లీ ఇదే ఆశతో ఉన్నారు. అయితే […]
Author: admin
టీడీపీలో హేమా హేమీలు పోటీలో ఉన్న ఎమ్మెల్సీ ఆ వర్గానికే !
రాష్ట్రంలో రాజుకున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు సామాజిక కోణంలోనూ సెగలు రేపుతున్నాయి. ముఖ్యంగా కాపు ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఆ వర్గంలోని ఓ వర్గం చంద్రబాబుకి వ్యతిరేకంగా పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో ఆ వర్గాన్ని బుజ్జగించాల్సిన అవసరం బాబుపై ఎంతైనా ఉందనేది విశ్లేషకుల మాట. ఇక, ఇదే సమయంలో తూర్పుగోదావరి జిల్లా స్థానిక సంస్థల తరఫున టీడీపీ ఓ అభ్యర్థిని నిలపాల్సి ఉంది. ఇప్పుడు దీనిని తనకు అనుకూలంగా మలుచుకోవాలని బాబు వ్యూహం […]
పరిటాల శ్రీరామ్ ఎంట్రీ ఇవ్వాలంటే సునీత డిసైడ్ కావాల్సిందే !
అనంతపురం పాలిటిక్స్ గురించి చెప్పుకొంటే ముందుగా మాట్లాడేది పరిటాల రవి ఆయన కుటుంబ రాజకీయాల గురించే. రవి ఇప్పుడు లేకపోయినా కూడా ఆయన భార్య, కుమారుడు శ్రీరామ్ మాత్రం చక్రం తిప్పుతున్నారు. ఇక, ఈ జిల్లాలో రవి ఉండగా టీడీపీకి ఎదురు లేకుండా పోయింది. అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. జిల్లా మొత్తంగా టీడీపీ ఆధిపత్యం ఉన్నప్పటికీ.. వర్గాలుగా మాత్రం చీలిపోయారు. ఆదినుంచి పరిటాల వర్గానికి పట్టున్న ధర్మవరంలో వరదాపురం సూరి పాగా వేశాడు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా […]
ఎమ్మెల్సీ రేసులో ఆంధ్రా అంబానీ!
ఏపీ ఎమ్మెల్సీల రేసు సరికొత్త పుంతలు తొక్కుతోంది! ఇప్పటి వరకు సొంత పార్టీ టీడీపీ, వైకాపా జంపింగ్లు, మరోపక్క హరికృష్ణ వంటి బంధువర్గం సీఎం చంద్రబాబుకి ఊపిరి తీసుకోనివ్వడంలేదని అనుకుంటుంటే.. ఇంకో వైపు నుంచి భారీ పారిశ్రామిక వేత్తల నుంచి కూడా పెద్ద ఎత్తున బాబుపై ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన ఆంధ్రా అంబానీగా పేరున్న ‘మాధవరావు’ ఎమ్మెల్సీ పోస్టు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. గతంలో టీడీపీ […]
అఖిల్ పెళ్లి క్యాన్సిల్: నాగ్ మౌనం వెనక షాకింగ్ రీజన్
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునకు తన సినిమా కేరీర్తో పాటు ఇతరత్రా విషయాల్లో ఏ చిన్న విషయం మీడియాలో వచ్చినా వెంటనే ప్రెస్మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వడమో లేదా సోషల్ మీడియాలో స్పందించడమో అలవాటు. మీడియాతో చాలా ఫ్రెండ్లీగా ఉండే నాగ్ ఏ చిన్న విషయాన్ని కూడా దాచడానికి ఇష్టపడడు.అతెందుకు చైతు-సమంత ప్రేమించుకున్న విషయాన్ని మీడియా వాళ్లు ప్రస్తావిస్తే అవునని ఓపెన్గానే చెప్పేశాడు. అలాంటి నాగ్ ఇప్పుడు అఖిల్ పెళ్లి మ్యాటర్ క్యాన్సిల్ వార్తలు మీడియాలో ప్రకంపనలు […]
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు హరికృష్ణ షాక్!
ఇటీవల కాలంలో అంతగా యాక్టివ్గా లేని ఏపీ సీఎం చంద్రబాబు బావ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ.. మళ్లీ పొలిటికల్గా యాక్టివ్ అయ్యేందుకు ట్రై చేస్తున్నారా? ఎలాంటి పదవీ లేకుండా ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆయన తిరిగి ఏదో ఒక పదవిలో కూర్చునేందుకు రెడీ అవుతున్నారా? అంటే ఔననే ఆన్సరే వస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. మొత్తంగా అటు స్థానిక, ఇటు శాసన సభ స్థానాలు 15 మందికి స్వాగతం […]
అమరావతి టాప్ 5 వెనక అసలు నిజానిజాలు
`అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా చేయడమే నాలక్ష్యం. 2029కి దేశంలోని ఐదు అత్యుత్తమ నగరాల్లో నిలపడమే నా ధ్యేయం` అని ఏపీ సీఎం చంద్రబాబు పదేపదే చెబుతూ ఉంటారు. అమరావతిలో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థలు, కంపెనీలు, వెడల్పయిన రోడ్డు, బ్రిడ్జిలు, ఉద్యానవనాలు, అత్యాధునిక టెక్నాలజీ వ్యవస్థ.. ఇలా ఒక్కటేమిటి అన్నీఉంటాయని గాలిలో మేడలు కట్టేస్తున్నారు. అరచేతిలో వైకుంఠం చూపించేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితి ఎలా ఉంది? రాజధాని నిర్మాణం ఎలా ఉంటుందో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. స్విస్ […]
బాబు ఆయనతో అప్రమత్తం.. కేంద్రం హెచ్చరిక
ప్రముఖ ఆధ్యాత్మిక మత గురువు దలైలామా.. ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిలో రెండు సార్లు పర్యటించి.. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఆశీస్సులు అందజేశారు. అమరావతిలో జరిగే కార్యక్రమాలకు దలైలామాను పిలవడం, ఆయనతో బాబు సన్నిహిత సంబంధాలు నెరుపుతుండటంపై కేంద్రం సున్నితంగా హెచ్చరికలు జారీ చేసింది. ఆయనతో ఆచితూచి వ్యవహరించాలని, లేకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించిందట. ఇదంతా ఎందుకంటే.. చైనాకు దలైలామా శత్రువు కనుక.. ఏపీతో ఆయన సత్సంబంధాలు కొనసాగిస్తే.. ఆ ప్రభావం దేశీయ వాణిజ్యంపై […]
మిత్రపక్షాన్ని దూరం చేసుకుంటున్న టీఆర్ఎస్
తెలంగాణలో అధికార టీఆర్ఎస్, మజ్లిస్ల బంధం లోపాయికారీగానే కొనసాగుతూనే ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేసినా.. అవి వారి మిత్ర బంధాన్ని చెడగొట్టే స్థాయిలో ఉండవు! అయితే ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఎన్నిక రెండు పక్షాల మధ్య విబేధాలకు దారితీసిందట. అధికార టీఆర్ఎస్ నిర్వహించిన సమావేశానికి ఎంఐఎం తరఫున ఏ ఒక్కరూ హాజరు కాకపోవడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. దీంతో ఇన్నేళ్ల మిత్రబంధానికి శుభం కార్డు పడవచ్చనే […]