లేడీ సూపర్ స్టార్ నయనతార గత ఏడాది కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత విఘ్నేష్ శివన్ కెరీర్ దారుణంగా మారింది. అయితే నయనతారనే చేతులారా ఆమె భర్త కెరీర్ ను నాశనం చేసిందంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విఘ్నేష్ శివన్ కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కావాల్సి ఉంది. కెరీర్ లోనే తొలిసారి ఓ పెద్ద హీరోను డైరెక్ట్ చేసే అవకాశం రావడంతో విఘ్నేష్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ, అతడి అనందం ఎక్కువ కాలం నిలవలేదు. మెయిన్ లైన్ చెప్పి అజిత్ ను ఒప్పించిన విఘ్నేష్.. ఆ తర్వాత ఫుల్ స్క్రిప్ట్ తో మెప్పించలేకపోయాడు. ఈ క్రమంలోనే సినిమా చేసేందుకు అజిల్ ఒప్పుకోలేదు. అజిత్ ఇచ్చిన షాక్ కు విఘ్నేష్ డిప్రెషన్కు లోనయ్యారట. ఇంటికే పరిమితమయ్యే వరకు వచ్చారట.
ఇక భర్త పరిస్థితిని చూసిన నయనతార అజిత్తో సంప్రదింపులు జరిగా.. ఆయన విఘ్నేశ్తో సినిమా చేయడం లేదని మొహమాటం లేకుండా చెప్పేశారట. దీంతో అజిత్ పై నయన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఇందుకు సీరియస్ అయిన అజిత్.. ఈ సెలబ్రిటీ కపుల్స్తో అసలు సినిమాలే చేయద్దనే నిర్ణయానికి వచ్చారట. అంతేకాదు, లైకా బ్యానర్ లోనే మరో డైరెక్టర్ మగిళ్ తిరుమేణితో తన తదుపరి సినిమా చేసేందుకు రెడీ అయ్యారట. ఏప్రిల్ ఆఖరి వారంలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది. మొత్తానికి నయన్ ఇన్వాల్వ్మెంట్ కారణంగా చిన్న విషయం పెద్ద గొడవగా మారింది. ఈ క్రమంలోనే విఘ్నేష్ కెరీర్ క్లోజ్ అంటూ కోలీవుడ్ లో ప్రచారం ఊపందుకుంది.