పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా తెరకెక్కుతున్న తాజా మల్టీస్టారర్ `భీమ్లా నాయక్`. మలయాళంలో సూపర్హిట్ సాధించిన `అయ్యప్పనుమ్ కోశియమ్` సినిమాకు రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు లీకుల వీరులు షాక్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూ పోస్టర్ను లీక్ చేశారు. ఈ పోస్టర్లో రానా, పవన్ ఇద్దరూ ఫైటింగ్ చేసుకుంటూ కనిపించారు.
ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్గా మారింది. కాగా, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ప్లే అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది.