కింగ్ నాగార్జున తాజా చిత్రం `వైల్డ్ డాగ్`. అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దియా మీర్జా, సయామి ఖేర్, అలీ రెజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. హైదరాబాద్లో జరిగిన బాంబు పేళుళ్ల గురించి అందరికీ తెలిసిందే. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకునే ‘వైల్డ్ గాడ్’ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఏప్రిల్ 2న విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మంచి టాక్ తెచ్చుకుని దూసుకుపోతోంది. అయితే తాజాగా ఈ సినిమా చూసిన మెగా స్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా `వైల్డ్ డాగ్`పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `ఇప్పుడే వైల్డ్ డాగ్ చూసాను. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అతి దారుణమైన టెర్రరిస్ట్ ఘాతుకం వెనుకవున్న కిరాతకులని పట్టుకున్న ఆ ఆపరేషన్ని కళ్ళకి కట్టినట్టుగా చూపించారు.
ఆ ఆవేశాన్ని, ప్రాణాలకి తెగించి ఆ నీచుల్ని వెంటాడి వేటాడిన మన రియల్ లైఫ్ హీరోలని, ఆ రియల్ హీరోలని మరింత అద్భుతంగా చూపించిన నా సోదరుడు నాగార్జున, దర్శకుడు సాల్మన్, నిర్మాత నిరంజన్ రెడ్డి లని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ప్రతివారం విడుదలయ్యే చిత్రాల్లో ఒకటి కాదు..ప్రతి ఒక్క భారతీయుడు, తెలుగు వారు గర్వంగా చూడవల్సిన చిత్రం..డోంట్ మిస్ దిస్ వైల్డ్ డాగ్! వాచ్ ఇట్!! ` ట్వీట్లు చేశారు. ప్రస్తుతం చిరు ట్వీట్లు వైరల్గా మారాయి.
ఇప్పుడే #WildDog చూసాను.తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అతి దారుణమైన టెర్రరిస్ట్ ఘాతుకం వెనుకవున్న కిరాతకులని పట్టుకున్న ఆ ఆపరేషన్ని కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. ఆ ఆవేశాన్ని,ప్రాణాలకి తెగించి ఆ నీచుల్ని వెంటాడి వేటాడిన మన రియల్ లైఫ్ హీరోలని, ఆ రియల్ హీరోలని మరింత అద్భుతంగా.. 1/2
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 4, 2021
..చూపించిన నా సోదరుడు @iamnagarjuna వైల్డ్ డాగ్ టీంని దర్శకుడు #Solomon,నిర్మాత #NiranjanReddy లని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.ఇది ప్రతివారం విడుదలయ్యే చిత్రాల్లోఒకటి కాదు..ప్రతి ఒక్క భారతీయుడు,తెలుగు వారు గర్వంగా చూడవల్సిన చిత్రం..డోంట్ మిస్ దిస్ #WildDog ! వాచ్ ఇట్ !! 2/2
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 4, 2021