“కల్కి” సినిమాపై ఎలాంటి బజ్ నెలకొందో అందరికీ తెలిసిందే . కేవలం మరికొద్ది గంటల్లో ప్రభాస్ నటించిన సినిమా కల్కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది అని తెలిసి ఫ్యాన్స్ రచ్చ రంబోలా చేస్తున్నారు . భారీ భారీ కటౌట్లు ..ఫ్లెక్సీలతో.. పూలదండలతో .. పాలాభిషేకాలతో కల్కి సినిమా రిలీజ్ అయ్యే థియేటర్స్ వద్ద సందడి వాతావరణం క్రియేట్ చేస్తున్నారు . అయితే ప్రభాస్ కల్కి సంబంధించి కొందరు నెగిటివ్ గా కూడా ప్రచారం చేస్తూ ఉండడం గమనార్హం. మరీ ముఖ్యంగా ప్రభాస్ అంటే పడని కొందరు జనాలు సినిమాకి నెగిటివ్ టాక్ క్రియేట్ చేస్తున్నారు . కరెక్ట్ గా ఇదే మూమెంట్లోనే ఏపీ ప్రభుత్వం కల్కి సినిమా టికెట్ రేట్లు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఆంధ్ర గవర్నమెంటు కల్కి సినిమా టికెట్ల ధర పెంచుతూ అదనపు షోలకి సైతం ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది . ఈ నెల 27 నుంచి రెండు వారాలపాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది ఏపీ ప్రభుత్వం .ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం కల్కి సినిమా చిత్ర టిక్కెట్ సింగిల్ స్క్రీన్ పై 75 రూపాయలు మల్టీప్లెక్స్ లో 125 రూపాయల వరకు పెంచుకోవచ్చు అని పేర్కొంది . అంతే కాదు ఒక రోజుకు ఐదు షోలు నిర్వహించేందుకు వీళ్లుగా జీవో జారీ చేసింది . అయితే ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఇప్పుడు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
