ప్రియుడితో డెస్టినేషన్ వెడ్డింగ్ కు రెడీ అయిన స్టార్ హీరోయిన్ రకుల్ .. వేదిక ఎక్కడంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌కి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోల అందరి సరసన‌ నటించిన ఈ బ్యూటీ ఎన్నోహిట్ సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా గడిపింది. అయితే గ‌త‌ కొంతకాలంగా ఈమెకు టాలీవుడ్‌ల‌లో అవకాశాలు లేకపోవడంతో.. బాలీవుడ్‌కి చెక్కేసింది. అయితే అక్కడ ర‌కుల్‌కి సినిమాల్లో వర్కౌట్ కాకపోయినా.. పర్సనల్ జీవితం బాగా వర్కౌట్ అయింది. బాలీవుడ్ హీరో, కమ్‌ ప్రొడ్యూసర్ అయిన జాకీ బాగ్నానితో ఈమె డేటింగ్ చేస్తుంది. ఇక 2024 లో ఈ జంట ఏడడుగులు వేయబోతున్నారన న్యూస్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గత మూడేళ్లుగా జాకీభగ్నాని, రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తమ ప్రేమ బంధాన్ని మరో మెట్టు ముందుకు తీసుకెళ్లేందుకు ఈ జంట ప్లాన్ చేస్తున్నారట. ఫిబ్రవరిలో రకుల్, జాకీ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ కు ఈ జంట ప్లాన్ చేశారట. ఈ కపుల్ గోవాను పెళ్లి వేదికగా ఫిక్స్ చేసినట్లు సమాచారం. కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది సన్నిహితులను మాత్రమే ఈ జంట పెళ్లికి హాజరవుతారట. ఇక వీరిద్దరి మ్యారేజ్ డేట్ ని త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ఈ వార్తలో ఎంత ఉందో తెలియదు గానీ.. ప్రస్తుతం ఈ న్యూస్‌ సోషల్ మీడియా లో వైరల్ అవ్వడంతో రకుల్ ప్రీత్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ప్రస్తుతం రకుల్ తమిళ్‌లో ఆయాలన్‌, ఇండియన్ 2 సినిమాలో నటిస్తుంది. జాకీ భగ్నాని ఇప్ప‌టికే కొన్ని బాలీవుడ్ సినిమాల్లో హీరోగా నటించినా.. సక్సెస్ రాక‌పోవడంతో యాక్టింగ్ కు దూరమయ్యాడు. ప్రస్తుతం పలు సినిమాల ప్రొడక్షన్ కు ప్లాన్ చేస్తున్నాడు.