బిగ్బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజయవంతంగా బిగ్ బాస్ ట్రోఫీ అందుకుని బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ హౌస్ లో సెలబ్రిటీలను సైతం వెనక్కి నెట్టి ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి పల్లవి ప్రశాంత్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. ఇక బిగ్ బాస్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చినటువంటి ఈయన ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు.
ఈ క్రమంలోని బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినటువంటి కంటెస్టెంట్ అందరూ కూడా బిగ్ బాస్ బబ్ కార్యక్రమంలో పాల్గొంటారని విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఇంటర్వ్యూలో పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ…” నాకు హైదరాబాద్లో కూకట్పల్లి మార్కెట్ తప్ప మరి ఏమి తెలియదు. ఒక వ్యక్తి మా నాన్నను మీ కొడుకు ఏం చేస్తారని అడగడంతో పొలం పనులు చేస్తాడు బాయికాడ పనులు చేస్తాడు అని చెప్పడంతో చాలా చీప్ గా చూసి మాట్లాడి వెళ్లేవారు. దీంతో నాకు చాలా బాధేసేది.
దీంతో నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని నేను భావించా. నేను హైదరాబాద్ పోతాను అని 500 రూపాయలు చేత్తో పట్టుకుని హైదరాబాద్ వచ్చాను. అలా హైదరాబాద్ వచ్చిన నేను మనలాంటి వాళ్ళ బిగ్బాస్ కార్యక్రమానికి ఎందుకు వెళ్ళకూడదు అన్న ఆలోచన వచ్చింది. దీంతో గట్టిగా నిర్ణయించుకున్న.. నేను బిగ్ బాస్ కి వెళ్ళాలని. చివరికి నా ఆశ నెరవేరింది ” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.