లైగర్ సినిమా తో పూరి జగన్నాథ్ కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయిపోయారు.. లైగర్ సినిమా సమయంలో విజయ్ చార్మిలు చేసిన అతి వల్ల ఆ సినిమా చాలా ట్రోల్ కి గురైంది. లైగర్ ఈవెంట్లో వరంగల్ శీను స్పీచ్ లో ఆస్కార్ వరకు వెళ్లాయని ఈ అతి మాటల వల్లే చాలా ట్రెండీగా మారారు పూరి జగన్నాథ్.. లైగర్ సినిమా విడుదలకు ముందు వరంగల్ శ్రీనుకు పూరి జగన్నాథ్ ఛార్మికీ మంచి రిలేషన్ ఉండేది.. కానీ లైగర్ సినిమా ఫ్లాప్ గా కావడంతో వీరందరి మధ్య విభేదాలు మొదలయ్యాయి.
విజయ్ దేవరకొండ తన దారిలో తన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు.. పూరి కూడా హీరో రామ్ తో డబుల్ ఇస్మార్ట్ అంటూ ఒక సినిమా షూటింగ్ ని మొదలుపెట్టారు. అయితే పూరికి మళ్ళీ చాన్సులు వస్తాయ అనుకున్న సమయంలో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పూరి డబుల్ ఇస్మార్ట్ శంకర్ షూటింగ్లో బిజీగా ఉన్నారు.
ఇలాంటి సమయంలోనే పూరి జగన్నాద్ తన లుక్ ని పూర్తిగా మార్చేయడం జరిగింది. గుండు కొట్టించుకున్నట్లుగా కనిపిస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఈ ఫోటో షేర్ చేసిన ఛార్మి.. వెనకాల ఉన్న ఉదయించే సూర్యుడు పూరిని పోల్చుకుంటూ కామెంట్స్ చేయడం జరిగింది.. పూరి జగన్నాథ్ లుక్ బాగుందని చార్మి పోస్ట్ కింద పలువురు నేటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా పూరి జగన్నాథ్ ఫోటో పైన ఛార్మి చేసిన ఈ పోస్టు వైరల్ గా మారుతోంది.
View this post on Instagram