టాలీవుడ్ మోస్ట్వాంటెడ్ బ్యూటీ ఎవరు అనగానే అందరి నోటా వినిపించే పేరు శ్రీ లీల. ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో నటించింది. ఈ సినిమాలో బాలయ్య కూతురుగా విజ్జి పాత్రలో నటించింది ఈ బ్యూటీ. ఇక తాజాగా భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్లో జరిగిన ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను సోషల్ మీడియాతో షేర్ చేసుకుంది.
శ్రీలీల తన సినీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ నేను ఎటువంటి యాక్టింగ్ స్కూల్ కి వెళ్లలేదని.. నాకు భరతనాట్యం పై పట్టు ఉంది.. ఇందులో ఏ డైలాగ్స్ లేకుండానే అందరికీ కథను వినిపించాలి.. అలా చేయడం చాలా కష్టం.. భరతనాట్యంలో పట్టు ఉండడంతో నాకు నటన పెద్దగా కష్టం అనిపించలేదు. అలాగే రాఘవేంద్రరావు సినిమాతో మొదట అవకాశం దక్కించుకొని టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యా.. ప్రస్తుతం వరుస అవకాశాలు రావడంతో బిజీగా గడుతున్న అయినా నా మెడిసిన్ చదివు మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు.
అది నా లక్ష్యం అంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ మా కుటుంబంలో అమ్మతో పాటు అన్నయ్య కూడా డాక్టర్ ఒకసారి మా అమ్మమ్మ ఇంటికి వెళ్లాను. అది మారుమూల గ్రామం.. ఒకరోజు అమ్మమ్మ హఠాత్తుగా కింద పడిపోయింది. నాకు ఏం చేయాలో తోచలేదు. అందరితో పాటు అక్కడే నిలబడి ఉన్నాను. అయితే అన్నయ్య వెంటనే వచ్చి అమ్మమ్మని లేపి వైద్యం చేశాడు. దీంతో అమ్మమ్మ ప్రమాదం నుంచి తప్పుకుంది. అన్నయ్య మెడిసిన్ చదువుతున్నాడు కాబట్టి ఆ టైంలో ఏం చేయాలో చేశాడు.. కానీ నాకు సాయం చేయాలనిపించిన నేను ఏం చేయలేకపోయాను.
ఆ రోజు ఫిక్స్ అయ్యా ఎప్పటికైనా డాక్టర్ కావాలని. అందుకే మెడిసిన్ కోర్స్ తీసుకున్నాను. షూటింగ్స్ తో బిజీగా ఉన్న పరీక్షలు ఉన్నప్పుడు రాత్రి చదువుకుంటాను. ఇప్పుడే నేను సినిమాలు ఒప్పుకుంటే అది నా చదువుపై ప్రభావం చూపుతుందని నాకు తెలుసు.. అయితే ఇప్పుడు మంచి పాత్రలో వస్తున్నాయి. అందుకే కొంచెం కష్టమైన సరే సినిమాలకు ఒప్పుకున్నాను. రాత్రి పూట చదువుకుంటున్నాను.. అంటూ శ్రీలీల చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రీ లీల చేసిన ఈ కామెంట్స్ వైరల్గా మారాయి.