రోజా ఇంటికి వెళ్లిన సీనియర్ హీరోయిన్.. కారణం అదేనా..?

అలనాటి హీరోయిన్లలో రోజా, రమ్యకృష్ణ లకు ఎంతటి క్రేజీ ఉందో చెప్పాల్సిన పని లేదు.. అయితే ఇప్పుడు తాజాగా వీరిద్దరూ ఒకేసారి కలుసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా రోజా వ్యవహరిస్తున్న సంగతి తెలిసింది..రమ్యకృష్ణ ఇప్పటికే పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది.బాహుబలి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది రమ్యకృష్ణ. తాజాగా ఈ ఇద్దరు స్టార్స్ కలుసుకోవడంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. రమ్యకృష్ణ తన కుమారుడితో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడం జరిగింది.

There is no selfishness in friendship…' – Ramya Krishnan who met Roja

అక్కడ దేవాలయాన్ని దర్శించుకొని తర్వాత తిరిగి ప్రయాణంలో మంత్రి రోజే ఇంటికి వెళ్లడం గమనార్హం. అందుకు సంబంధించిన ఫోటోలు సైతం రోజా తమ ట్విట్టర్లో తెలియజేసింది.. రమ్యకృష్ణ కు రోజా సాధారణంగా స్వాగతం పలికారు.. తమ ఇంట్లో భోజనం కూడా పెట్టినట్లు తెలియజేసింది. అనంతరం రోజా ఆమెకు బొట్టు పెట్టి చీర పెట్టడం విశేషం. ఈ ఫోటోలను షేర్ చేసిన రోజా రమ్యకృష్ణతో తనకున్న అనుబంధాన్ని కూడా తెలియజేయడం జరిగింది.

రోజా ఇలా రాసుకుంటూ తాను సారి పెడుతున్న వీడియోని కూడా షేర్ చేశారు..”ఇద్దరు స్నేహితులు మంచి నక్షత్రాలు అని మీరు వారిని ఎప్పుడు చూడరు కానీ ఎల్లప్పుడూ కూడా అక్కడే ఉన్నారని మీకు తెలుసు ఈరోజు నా రోజు అని చాలా అందంగా మార్చిన నక్షత్రానికి తాను హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాను అంటూ రమ్యకృష్ణను ఉద్దేశిస్తూ రోజా ఈ పోస్ట్ పెట్టడం గమనార్హం”.. ఇక అంతే కాకుండా గత రోజులలో తమ జీవితం చాలా ఆనందంగా ఉండేది ఎక్కువగా నవ్వుకునే వాళ్ళ చాలా సంతోషంగా కలుసుకునే వాళ్ళమంటూ తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.V