సుప్రీం హీరో మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ యాక్సిడెంట్ తర్వాత రీ ఎంట్రీ తో విరూపాక్ష అనే సినిమా ద్వారా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ తో బ్రో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా జూలై 28వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో శెరవేగంగా పాల్గొంటున్నారని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదల కాగా అందులో సాయి ధరంతేజ్ లో మునుపటి డాన్స్ మూమెంట్స్, ఆ హుషారు కనిపించడం లేదు అంటూ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు.
సాయి ధరంతేజ్ మాట్లాడుతూ.. బైక్ ప్రమాదం తర్వాత నాకు ఇది పునర్జన్మ లాంటిది.. ఈ ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ కూడా మెడిసిన్స్, ట్రీట్మెంట్ వల్ల బాడీలో ఇంకా కొన్ని సమస్యలు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడు నా డాన్సులు చూసి ఫ్యాన్స్ మాత్రమే కాదు నేను కూడా నిరాశ పడ్డాను. అయితే సాకులు చెప్పడం లేదు కానీ తప్పకుండా అభిమానులు కోరుకునే విధంగా మునుపటి కంటే దీటుగా డాన్స్ చేయగలను. కాకపోతే కోలుకోవడానికి ఇంకా టైం పడుతుంది ఫిజికల్ గా మూవ్ కావడం మాత్రమే కాదు శరీరంలో కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయి.
యాక్సిడెంట్ తర్వాత కనీసం మాట్లాడలేకపోయాను అయితే ఇప్పుడు దానిని అధిగమించాను. అసలు సమస్య యాక్సిడెంట్లో అయిన గాయాల వల్ల కాదు కోమాలో ఉన్నప్పుడు నాకు స్టెరాయిడ్స్ ఇచ్చారు. వాటి ప్రభావం ఇంకా బాడీపై అలాగే ఉంది. ఫిజికల్ ఫిట్నెస్ కోల్పోయాను.. తిరిగి ఆ ఫిట్నెస్ గైన్ చేయాలి అంటే దాని మీద వర్క్ అవుట్ చేయాలి. స్టెరాయిడ్స్ ఇతర మెడిసిన్స్ వల్ల పూర్తిగా వర్కౌట్ చేయలేకపోతున్నాను. త్వరలోనే అన్ని అధిగమించి మళ్లీ మీ ముందుకు వస్తాను అంటూ తేజు తెలిపాడు.