లావణ్య, వరుణ్‌ల మధ్య ప్రేమ చిగురించడానికి ఆ డైరెక్టర్ కారణం?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ఈ నెల 9న కుటుంబ సభ్యుల అంగీకారంతో ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారనే వార్త చక్కర్లు కొడుతుంది. గతంలో వీరిద్దరికి సంబంధించిన వార్తలు చాలా వినిపించాయి కానీ, ఇప్పుడు వీరిద్దరికీ నిజంగానే ఎంగేజ్మెంట్ కన్ఫర్మ్ అయిందనే వార్త జోరుగా వినపడుతుంది. ఇప్పటికే వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన పనులు మొదలయ్యాయి. ఇండస్ట్రీలోని పలువురు సెలబ్రిటీలకు వరుణ్, లావణ్య ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఆహ్వానం అందినట్లు తెలుస్తుంది.

ఇది ఇలా ఉండగా వీరిద్దరికి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే లావణ్య, వరుణ్ తేజ్‌ల మధ్య ప్రేమ చిగురించడానికి కారణం దర్శకుడు శ్రీనువైట్ల అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ‘మిస్టరీ’ సినిమాలో లావణ్య త్రిపాఠి,వరుణ్ తేజ్ జంటగా నటించారు. 2017 లో రిలీజ్ అయిన ఈ సినిమా షూటింగ్ సమయంలో లావణ్య,వరుణ్ ల మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తుంది.

వరుణ్ తేజ్ తెలుగులో ముకుంద, ఫిదా, గద్దల కొండ గణేష్, ఎఫ్2, ఎఫ్3 లాంటి సినిమాల్లో హీరోగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక లావణ్య విషయానికి వస్తే ‘అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తరువాత ఉన్నది ఒకటే జిందగీ, ఏ 1 ఎక్స్‌ప్రెస్, సోగ్గాడే చిన్నినాయన, చావు కబురు చల్లగా, భలే భలే మగాడివోయ్, శ్రీరస్తు శుభమస్తు లాంటి ఎన్నో సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది.