తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ సుపరిచితమే.. తమిళంలో ఎక్కువగా సినిమాలలో నటిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. దాదాపుగా ఇప్పటివరకు 50 సినిమాలలో హీరోయిన్గా నటించినది.. మిగతా హీరోయిన్లతో పోలిస్తే అందం విషయంలో కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ నటనపరంగా అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉంటుంది ఐశ్వర్య రాజేష్. తెలుగులో ఈమె కౌసల్య కృష్ణమూర్తి, టక్ జగదీష్, రిపబ్లిక్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి చిత్రాలలో నటించింది.
ఈ చిత్రాలతో పరవాలేదు అనిపించుకున్న ఐశ్వర్య రాజేష్.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందనుకుంటే అది పొరపాటే.. ఈమె తండ్రి రాజేష్ కూడా అప్పట్లో టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో హీరోగా కూడా నటించారు.. ముఖ్యంగా నెలవంక అనే చిత్రంలో నటించిన ఈయన మంచి పాపులారిటీ సంపాదించారు. కానీ ఆ తర్వాత నటించిన ఏ ఒక్క చిత్రం కూడా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయాయి.దీంతో రాజేష్ ఇండస్ట్రీలో సక్సెస్ కాలేకపోయారు.
ఆ తరువాత చెన్నైలో స్థిరపడి కొన్ని రోజులు వ్యాపారాలు కూడా చేసినట్టు సమాచారం. కానీ కాలం కలిసి రాక ఐశ్వర్య రాజేష్ చిన్న వయసులోనే తన తండ్రి మరణించినట్టు తెలుస్తోంది. ఐశ్వర్య రాజేష్ తండ్రి నటుడు అవ్వడంతో ఐశ్వర్య రాజేష్ చిన్నతనం నుంచి ఏదైనా సినిమాలో నటించాలని కోరిక ఉండేదట
..అలా రాజేంద్రప్రసాద్ బాపు దర్శకత్వంలో వచ్చిన రామ బంటు అనే చిత్రంతో బాలనాటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ 2010 సంవత్సరం వరకు సినిమాల వైపు చూడలేదు. తాతంది మరణించడంతో ఆర్థిక కష్టాలు ఎదురు కావడంతో చిన్న వయసు నుంచే తన తల్లికి సహాయం చేస్తూ ఉండేదట. ప్రస్తుతం ఒక చిత్రానికి కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.