జాతి రత్నాలు -2 చిత్రంపై క్లారిటీ ఇదే..!!

కరోనా తర్వాత ప్రేక్షకులను థియేటర్కు రప్పించిన చిత్రం జాతి రత్నాలు.. ఈ సినిమాని వైజయంతి స్వప్న సినిమాస్ బ్యానర్ పై డైరెక్టర్ అనుదీప్ తెరకెక్కించారు. ఈ చిత్రం పాండమిక్ టైంలో పెద్ద సెన్సేషనల్ గా మారింది. ఈ చిత్రం సక్సెస్ మీట్ లో జాతి రత్నాలు-2 ఉంటుందని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది డైరెక్టర్ అనుదీప్. అయితే ఇప్పటివరకు ఈ విషయానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేయలేదు. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి తదితరులు నటించి రేచర్లను కడుపుగా నవ్వించారు. అయితే ఈ సినిమా వెనుక నుండి డైరెక్టర్ నాగ్ అశ్విన్ అనుదీప్ తో దర్శకత్వం చేయించినట్లుగా తెలుస్తోంది.

Sequel for Jathi Ratnalu is all set to start
అయితే మొదటిసారి ఈ సినిమా అయితే పరవాలేదు అనిపించుకుంది. ఒకవేళ ఇవే కనుక సీక్వెల్లో ఉంటే మాత్రం చాలా కష్టమని చెప్పవచ్చు. జాతి రత్నాలు సినిమా సూపర్ అయ్యిందని జాతి రత్నాలు -2 కూడా ఇదే లెవెల్లో తెరకెక్కిస్తే ప్రేక్షకులు పెద్దగా ఆకట్టుకోలేరని చెప్పవచ్చు. దీంతో మేకర్స్ కొద్దిగా ఆలోచనలో పడినట్లుగా తెలుస్తోంది.. అయితే యుఎస్ షిఫ్ట్ అయిన ముగ్గురు స్నేహితులు అక్కడ ఎలా సర్వర్ అయ్యారు అనే కథ అంశంతో విచిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా అక్కడ నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.

మాస్ ఆడియన్స్ కి ఇది ఆకట్టుకుంటుందా లేదా అన్న విషయం తెలియదు..కాబట్టి జాతి రత్నాలు-2 చిత్రం ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లుగా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి రీసెంట్గా శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమాను చేసిన డైరెక్టర్ అనుదీప్ తన నెక్స్ట్ సినిమా అప్డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు.. జాతి రత్నాలు-2 సినిమా ఉంటుంది కానీ అందుకు కాస్త సమయం పడుతుందని మాత్రం తెలుస్తోంది.