టాలీవుడ్ ఇండస్ట్రీకి తన అందంతో అభినయంతో ప్రేక్షకులను మైమరిపించేలా చేసిన ఒకప్పటి హీరోయిన్ మాధవి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈమె ఏలూరుకు చెందిన అమ్మాయి అప్పట్లో విజయశాంతి ,జయసుధ, జయప్రద వంటి స్టార్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు ముఖ్యంగా చెప్పాలంటే ఈమె చిరంజీవితో ఎక్కువ సినిమాలు నటించింది.అలా నటించిన మాధవి వెండితెరపై చెరగని ముద్రను వేసుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఇమే గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరమైంది.ఆ తరువాత వివాహం చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యింది.
ఇక చిరంజీవితో ప్రాణం ఖరీదు తో మొదలై ఆ తరువాత దాదాపు పది సినిమాలలో చిరంజీవి సరసన నటించిన మాధవి.. రజనీకాంత్, కమలహాసన్, శోభన్ బాబు, మమ్ముట్టి ,ఇలా ఇతర హీరోలతో కూడా నటించింది. ఈమె ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ మలయాళం, హిందీ ,ఒరియా భాషల్లో దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది.
అయితే సినిమా కెరీర్ పిక్స్ లో ఉండగానే అమెరికాకు చెందిన వ్యాపారవేత్త మ్యాన్ రాల్ఫ్ శర్మాను మాధవి వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్ మాధవిని మించిపోయే అందంతో ఈమె కూతుర్లు ఉన్నారు. మించిపోయారు.. వీరు ఎంట్రీ ఇస్తే హీరోయిన్లుగా తమకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటారని మాధవి అభిమానులు తెలియజేస్తున్నారు.ప్రస్తుతం మాధవి దంపతులు అమెరికాలోని స్థిరపడ్డారు.సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మాధవి తన భర్త బిజినెస్ బాధ్యతలను తనే చూసుకుంటున్నారట. అలా కుటుంబంతో ఎంజాయ్ చేస్తోంది మాధవి. ప్రస్తుతం మాధవి ఫ్యామిలీకి సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
View this post on Instagram