ఆ హీరో, హీరోయిన్ చావుకు ద‌గ్గ‌ర్లో ఉన్నారు.. సంచలనం రేపిన వేణు స్వామి!

ప్రముఖ జ్యోతిష్యుకుడు వేణు స్వామి సోష‌ల్ మీడియాలో ఎంత ఫేమ‌స్సో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చిత్ర పరిశ్రమలో ఈయ‌న పేరు త‌ర‌చూ వినిపిస్తూనే ఉంటుంది. అడగకపోయినా సెల‌బ్రిటీల జాత‌కాలు చెబుతూ ఉంటాడు వేణు స్వామి. వాటిలో కొన్ని నిజం కావడంతో వేణు స్వామి మరింత ఫేమస్ అయ్యాడు. కొన్ని నెలల కిందట నాగచైతన్య, సమంతలు విడిపోయిన విషయం తెలిసిందే. ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకే దూరమయ్యారు.

అయితే ఈ విషయాన్ని చైతు, సామ్‌ లు పెళ్లి చేసుకున్న సమయంలోనే వేణు స్వామి చెప్పారు. ఈయ‌న చెప్పిన‌ట్లే వారిద్ద‌రూ విడిపోవ‌డంతో వేణు స్వామిని చాలా మంది న‌మ్మ‌డం ప్రారంభించారు. దీంతో వేణు స్వామి ఇంట‌ర్వ్యూలు, వీడియోలు సైతం యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతుంటాయి. ఇక‌పోతే తాజాగా వేణు స్వామి ఓ హీరో, హీరోయిన్ చావుకు ద‌గ్గ‌ర్లో ఉన్నారంటూ షాకింగ్ కామెంట్స్ తో సంచ‌ల‌నం రేపాడు.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి.. త్వరలోనే టాలీవుడ్‌ లో యంగ్ హీరో, హీరోయిన్ చనిపోతారని తెలిపాడు. వృశ్చిక రాశికి చెందిన హీరో, మేషరాశికి సంబంధించిన హీరోయిన్ చావుకు దగ్గరలో ఉన్నారని.. 2027 లేదా 28లో వీరిద్దరూ అనారోగ్య సమస్యలతో చనిపోతారంటూ వేణు స్వామి వెల్ల‌డించాడు. ముఖ్యంగా హీరో అనారోగ్య సమస్యలు తట్టుకోలేక సూసైడ్ చేసుకునే అవకాశం ఉందంటూ వేణు స్వామి పేర్కొన్నారు. దీంతో కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.