టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరూ జంటగా వెకేషన్ కోసం మాల్దీవ్స్ కు వెళ్లి ఏకాంతంగా గడిపి వచ్చారు. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా ఒప్పుకుంది. అయితే మాల్దీవ్స్ కు వెళ్లింది నిజమే కానీ విజయ్ తో తనకు ఉన్నది మంచి స్నేహబంధం మాత్రమే అని రష్మిక అంటోంది.
కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరూ సీక్రెట్ గా ప్రేమాయణం నడుపుతున్నారంటూ విపరీతంగా కథనాలు వస్తున్నాయి. తాజాగా వీరి లవ్ ఎఫైర్ పై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశాడు. రష్మికను వద్దని చెప్పినా విజయ్ దేవరకొండతో లవ్ ఎఫైర్ పెట్టుకుంది. అందుకే విజయ్కు ఉన్న దరిద్రం ఆమెకు అంటుకుంది.
విజయ్తో ఎఫైర్ పెట్టుకున్నప్పటి నుంచే రష్మిక కాంట్రవర్సీల్లో ఇరుక్కుంటోంది అంటూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈయన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. విజయ్ అభిమానులు వేణు స్వామి కామెంట్స్ ను తీవ్ర ఖండిస్తున్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని ఫైర్ అవుతున్నారు.