సినిమాల వల్ల తనలోని సింగర్ ఎదగలేదని శ్రుతి సెన్సేషనల్ కామెంట్స్!

ప్రముఖ నటి శ్రుతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలో హీరోయిన్‌గా నటించి ఎంతో మంది అభిమానులను గెలుచుకుంది. కమల్ హాసన్ కూతురిగా కాకుండా తన సొంత టాలెంట్‌తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నిజానికి శృతిని మల్టిటాలెంట్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. అలానే సింగింగ్‌లో కూడా ఆమెకి మంచి పేరు ఉంది. కానీ తన కెరీర్ మొదలైనప్పుడు మాత్రం సింగింగ్ ఆపేసానని చెప్పింది ఈ అమ్మడు.

ఇటీవలే శ్రుతి హాసన్ తన అనుభవాలను అభిమానులతో పంచుకుంది. శ్రుతి మాట్లాడుతూ ” నేను నా సినీ కెరీర్‌ని మొదలు పెట్టినప్పుడు చాలా మంది నా సింగింగ్ టాలెంట్ గురించి ఎక్కువగా మాట్లాడకండి అని సలహా ఇచ్చారు. అది మీ సినిమాలపై ప్రభావం పడి ఎవరూ మీ సినిమా లు చూడరు అని అన్నారు. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో మల్టీ టాలెంట్ నటులకే ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. నిజానికి మ్యూజిక్ తో పోలిస్తే సినిమాలపై ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. కానీ నాకు మాత్రం ఆ రెండిటిపై మంచి పట్టు ఉంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది.” అని చెప్పుకొచ్చింది. సినిమాల వల్ల తనలోని సింగర్ పెద్దగా ఎదగలేదు, లేదంటే ఫస్ట్ నుంచి పాటలు పాడుతూ స్టార్ సింగర్ అయ్యేదాని అన్నట్లు శ్రుతి మాట్లాడటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇకపోతే శ్రుతి హాసన్ చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య సినిమాలో నటించింది. అలానే బాలయ్య సరసన వీరసింహారెడ్డి సినిమాలో నటించి ప్రేక్షకులను అల్లరించింది. అయితే ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. ఇక ప్రస్తుతం శ్రుతి హాసన్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో ప్రభాస్‌తో జత కట్టబోతుంది. ఇటీవలే కాస్త గ్యాప్ తీసుకున్న ఈ అమ్మడు రవితేజతో కలిసి క్రాక్ సినిమాలో నటించి టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటినుండి శ్రుతి కెరీర్ టాలీవుడ్ లో మంచిగా ముందుకు వెళ్తుంది.