బాలీవుడ్ కలెక్షన్ల రికార్డులను తిరగరాస్తు చరిత్ర సృష్టిస్తుంది. షారుక్ ఖాన్ నటించిన పఠాన్ రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పోస్ట్ కోవిడ్ తర్వాత అత్యంత భారీ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. కరోనా లాక్ డౌన్ పూర్తయిన తర్వాత ఇప్పటివరకు ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ బాలీవుడ్ లో ఈ స్థాయిలో కలెక్షన్లు దక్కించుకున్న సినిమా మరి ఏదీ లేదు.
పెద్ద హీరోల సినిమాలు వచ్చిన బాక్స్ ఆఫీస్ వద్ద తమ సత్తా చూపించలేకపోవటం ఆనవాయితీగా కొనసాగుతూ వచ్చింది. కొత్త సంవత్సరం భూల్ భులయ్యా, దృశ్యం2 వంటి సినిమాలో చెప్పుకోదగ్గ కలెక్షన్లు సంపాదించుకున్నాయి. మరోపక్క సౌత్ సినిమాలు బాలీవుడ్ పై దండయాత్ర చేసుకుంటూ విజయం దక్కించుకుంటున్నాయి.
ఈ క్రమంలోనే బాలీవుడ్ పని అయిపోయిందని అనుకుంటున్నా వేళ పడి లేచిన కెరటంలా షారుక్ ఖాన్ ఓ దారి చూపించాడు. షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా విడుదలకు ముందు రేగిన వివాదాలు దీన్ని వార్తల్లో నిలిపాయి, అంతేకానీ ఈ సినిమాపై భారీ అంచనాలు ఏమీ లేవు. అయినప్పటికీ ఈ సినిమా భారీ కలెక్షన్లను అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా గ్రాస్ వసూళ్ల మార్కు రూ.668 కోట్ల పై మాటే అని బాక్సాఫీస్ వర్గాలు అంటున్నారు.
ఈ కలెక్షన్లతో ఈ సినిమా అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలలో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అలాగే బాహుబలి 1 రికార్డులు బీట్ చేసింది. ఈ సినిమా బడ్జెట్ రూ.225 కోట్లు అని అంచనా. ఇప్పుడు గ్రాస్ వసూళ్ల మార్కుతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దశను దాటుకుని ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలు అందిస్తూ ఉంది. ఇక డిజిటల్ ఓటి వంటి నాన్ ధియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధర పలికింది. మొత్తానికి బాలీవుడ్ కి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాడు షారుక్.