తెలుగు సినీ పరిశ్రమలో నటుడు చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంతోమంది నటీనటులకు స్ఫూర్తిగా చిరంజీవి నిలిచారని చెప్పవచ్చు. ఇటీవల విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమాతో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్టైన్మెంట్గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా అందించిన సక్సెస్ తో తన తదువరి చిత్రాలను కూడా అంతే స్థాయిలో తెరకెక్కిస్తున్నారు చిరంజీవి. ప్రస్తుతం డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలో చిరంజీవి నటిస్తున్నారు.
ఒకవైపు ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతూ ఉండగానే మరొకవైపు చిరంజీవి నటించిన ఒక బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సన్నహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన చిత్రం గ్యాంగ్ లీడర్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ విజయ్ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాతో చిరంజీవి ఇమేజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలోని చిరంజీవి డైలాగులు విజయశాంతి ,చిరంజీవి మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్గా ఉన్నాయని చెప్పవచ్చు.
ఈ మేరకు ఒక ట్వీట్ కూడా వైరల్ గా మారుతోంది. 1991లో విడుదలైన ఈ సెన్సేషనల్ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. దీంతో మరొకసారి చిరంజీవి సినిమాని థియేటర్లో చూడడానికి అభిమానులకు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంగీతాన్ని బప్పి లహరి సంగీతం అందించారు. ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, శరత్ కుమార్, మురళీమోహన్ తదితరులు కీలకమైన పాత్రలు నటించారు. మరి ఈ సినిమా రీ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఎలాంటి సెన్సేషనల్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.