టాలీవుడ్‌లో మ‌రో వివాదం: చిరు – నాగ్ మ‌ధ్య కొత్త పంచాయితీ…!

తెలుగు సీనియర్ స్టార్ హీరోలలో చిరంజీవి, నాగార్జున ఎంతో గొప్ప స్నేహితులు. నాగార్జున చిత్ర పరిశ్రమకు వచ్చినప్పటి నుంచి చిరంజీవితో స్నేహంగా ఉంటూ వస్తున్నాడు. ఇద్దరు ఒకరికి ఒకరు ఎంతో గౌరవం ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఎన్నో సందర్భాల్లో నాగార్జున సినిమాలకు చిరంజీవి సాయం చేశాడు. అలాగే చిరంజీవి సినిమాలకు కూడా నాగార్జున సహాయం చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఇలాంటి సమయంలో తాజాగా వీరి మధ్య ఓ వివాదం మొదలైంది.

కొన్ని రోజుల క్రితం నాగార్జున, చిరు డైరెక్టర్ మోహన్ రాజా తో ఓ సినిమా చేయాలని భావించడు. కానీ అదే సమయంలో అప్పుడు చిరంజీవి మలయాళం రీమేక్ లూసీఫర్ సినిమా కోసం మోహన్ రాజ్ అని తీసుకువెళ్లిపోయాడు. ఆ సమయంలో చిరంజీవి స్వయంగా ఎంటర్ అవటంతో నాగార్జున వెనక్కి తగ్గాడు. తాజాగా ఇప్పుడు రవితేజ హీరోగా ధమాకా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు త్రినాథరావు నక్కినతో చిరంజీవి ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడు.

Nagarjuna issued notice over alleged illegal construction work in Goa, know  details | Celebrities News – India TV

అయితే ఇప్పటివరకు త్రినాథారావు తెరకెక్కించిన సినిమాలకు స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటర్ గా ఉన్న ప్రసన్నకుమార్ ఇప్పుడు దర్శకుడుగా మారిపోతున్నాడు. అది కూడా తన మొదటి సినిమాతోనే స్టార్ హీరో నాగార్జునతో పని చేయబోతున్నాడు. ఇప్పటికే ప్రసన్న- నాగార్జునకు ఒక కథ చేప్ప‌గా అయినా కూడా ఓకే చేశాడట. అతి త్వరలోనే ఈ సినిమా కూడా పట్టాలెక్కబోతోంది.

అయితే ఇప్పుడు ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది.. త్రినాధ రావు, ప్రసన్నకుమార్ లేకుండా న‌క్కిన‌ సినిమాలను తెరకెక్కించడం చాలా కష్టం. ఇప్పుడు ఇదే విషయాన్ని చిరంజీవి కూడా చెప్పాడట. కానీ నాగార్జున పట్టుబట్టి ప్రసన్న కుమార్‌ తో సినిమా చేయబోతున్నాడు. ఇలా ఇద్దరి నడుమ ఇప్పుడు కొత్త చిక్కు మొదలైంది. చూడాలి మరి ఇద్ద‌రిలో ఎవ‌రు త‌గ్గుతారో..!