మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా బుల్లి మెగాస్టార్ ఎప్పుడు వస్తాడు అన్న వారి ఆశకు మెగా కోడలు ఉపాసన మెగా అభిమానులకు రీసెంట్ గానే శుభవార్త చెప్పారు. త్వరలోనే మెగా కుటుంబంలోకి బుల్లి మెగాస్టార్ రాబోతున్నాడు అంటూ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
ఇప్పుడు రామ్ చరణ్- ఉపాసన అమెరికాలోని గోల్డెన్ గ్లోబ్ అవార్డులో సందడి చేశారు. గత సంవత్సరం విడుదలైన త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దకడంతో ఈ మూవీ టీమ్ మొత్తం అక్కడే సందడి చేశారు. ఈ క్రమంలోనే మెగాకోడలు ఉపాసన కూడా రామ్ చరణ్ తో అక్కడ ఎంతో స్టైలిష్ గా కనిపించారు.
ఈ క్రమంలోనే తన సోషల్ మీడియాలో ఉపాసన ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేసింది. ఉపాసన త్రిబుల్ ఆర్ టీమ్ తో భాగమైనందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది.. దేశం మొత్తం గర్వించదగ్గ విజయం ఇది.. ఈ ప్రయాణంలో నేను భాగమయ్యేలా చేసినందుకు రామ్ చరణ్ కు మరియు దర్శకుడు రాజమౌళికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది ఉపాసన.
అంతేకాకుండా ఈ వేడుకల్లో తనతోపాటు .. తన కడుపులో ఉన్న బేబీ కూడా గొప్ప అనుభూతి పొందినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఇప్పుడు ఈ పోస్ట్ చూసిన మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఉపాసన తొలిసారిగా తన కడుపులో ఉన్న బిడ్డ గురించి పోస్ట్ చేయడంతో మెగా అభిమానులు ఆనందం సంబరాన్ని అంటింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
View this post on Instagram