యంగ్ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగులో చేసిన చిత్రాలు పెళ్లి సందడి, ధమాకా. ఈ రెండు చిత్రాలు కమర్షియల్ గా మంచి విజయం సాధించాయి. అదే సమయంలో శ్రీలీలకు భారీ క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. చేసింది రెండు సినిమాలే అయినా ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్ లో బిజీ హీరోయిన్గా మారింది. రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ఓ పాన్ ఇండియా చిత్రంలో శ్రీలీల నటిస్తోంది.
అలాగే నటసింహ నందమూరి బాలకృష్ణ కూతురు పాత్ర కోసం`ఎన్బీకే 108` లో ఎంపిక అయింది. వీటితో పాటు నితిన్ తో జూనియర్, నవీన్ పోలిశెట్టితో అనగనగా ఓ రాజు, వైష్ణవ్ తేజ్ తో సినిమాకు కమిట్ అయింది. మొత్తానికి చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న శ్రీలీల తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. అలాగే తనుకు కోపం వస్తే ఎలా ప్రవర్తిస్తాను అన్నది కూడా శ్రీలీల వివరించింది.
తనలో ఒక అపరిచితుడు ఉన్నాడని, కొన్నిసార్లు తనకు తెలియకుండానే కోపం తన్నుకు వచ్చేస్తుందని శ్రీలీల చెప్పుకొచ్చింది. ఆ టైంలో అందరిపైనా అరిచేస్తానని.. అమ్మ ఉన్నా సరే ఆమెపై రెచ్చిపోతానని అస్సలు ఆగనని.. కోపం చల్లారిన తర్వాత అమ్మను తిట్టినందుకు ఏడుస్తానని శ్రీలీల తెలిపింది. ఇక తన కోపాన్ని అమ్మ కాబట్టే భరిస్తోందని.. మరొకరైతే పారిపోతారంటూ పచ్చి నిజాలు మాట్లాడేసింది. దీంతో ఈ యంగ్ బ్యూటీ కామెంట్స్ కాస్త వైరల్ గా మారాయి.