టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. రక్షిత రెడ్డి అమ్మాయిలో శర్వానంద్ త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నాడు. రక్షిత రెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె. అంతే కాకుండా ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి రక్షిత మనవరాలు అవుతుంది.
శర్వానంద్, రక్షితలది పెద్దలు కుదిర్చిన వివాహం. గురువారం నాడు హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో వీరి నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, బంధువులతో పాటు టాలీవుడ్ తారలు సైతం శర్వా ఎంగేజ్మెంట్ లో సందడి చేశారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
అయితే ఇప్పుడు రక్షిత పేరిట ఉన్న ఆస్తుల విలువ హాట్ టాపిక్ గా మారింది. రక్షిత రెడ్డి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తుంది. తన తండ్రి మధుసూదన్ రెడ్డి రక్షిత పేరిట ఎన్నో ఆస్తులు సంపాదించారట. అలానే తండ్రి ఆస్తితో పాటు తన తాతల తరం నుంచి వస్తున్న ఆస్తులు కూడా రక్షిత పేరు మీద ఉన్నాయని.. వాటి విలువ ఐదు వందల కోట్లకు పైగా ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వందల కోట్లకు వారసురాలు అయిన రక్షిత మెడలో శర్వా మరికొద్ది రోజుల్లో మూడు ముళ్లు వేయబోతున్నాడు.