సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న అందాల భామ సమంత.. కొద్ది నెలల క్రితం భర్త నాగ చైతన్యకు దూరమైన సంగతి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఎవరూ ఊహించని విధంగా విడాకుల బాట పట్టి అందరికీ షాక్ ఇచ్చారు. చైతో విడిపోయిన తర్వాత సమంతపై ఎన్నో విమర్శలు వచ్చాయి. చాలా మంది సమంతనే తప్పు పడుతూ విమర్శలు గుప్పించారు.
కానీ, సామ్ మాత్రం ఆ విమర్శలను ఎదుర్కొని కెరీర్ పరంగా మరింత జోరు పెంచింది. వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లను ప్రకటించింది. అయితే ఇంతలోనే ఆమె మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైంది. ఈ వ్యాధి కారణంగా సమంత షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చింది. ఇంటికే పరిమితమై చికిత్స తీసుకుంటోంది. ఇప్పుడిప్పుడే మయోసైటిస్ నుంచి సమంత కోలుకుంటోంది. ఇకపోతే ఈ కష్టకాలంలో సమంతకు తోడుగా ఉన్నది హ్యాష్, సాషాలే. అవి సమంత పెట్ డాగ్స్.
సమంత వద్ద చాలా కాలంగా హ్యాష్ పెరుగుతుంది. తర్వాత దానికి జంటగా సాషాను తెచ్చుకుంది. ఈ రెండు అంటే సమంతకు ప్రాణం. వాటిని సొంత బిడ్డలతో సమానంగా ఆమె చూసుకుంటుంది. హ్యాష్, సాషాలు కూడా సామ్ ను క్షణం కూడా వదిలిపెట్టవు. తాజాగా సమంత ఇన్స్టాలో తన రెండు పెట్ డాగ్స్ తో దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోకి `నీ వెనుక నేను ఉన్నాను అమ్మా… ధైర్యంగా ఉండు` అని సామ్ కు తన పెట్స్ ధైర్యం చెబుతున్నట్లుగా ఈ పోస్ట్ పెట్టింది. ఇక హ్యాష్, సాషాలతో సామ్ కు ఉన్న అనుబంధాన్ని ఆమె తాజా పోస్ట్ తెలియజేస్తోంది.
https://www.instagram.com/p/CnWoupKrwer/?utm_source=ig_web_copy_link