నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గత ఏడాది వరుస వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రష్మిక సొంత గడ్డ అయిన కన్నడలో.. ఆమెపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత నెలకుంది. ఇక వివాదాల నేపథ్యంలో రష్మిక కెరీర్ డేంజర్ జోన్ లో పడింది. ప్రస్తుతం రష్మిక కు ఆఫర్లు బాగా తగ్గిపోయాయి. స్టార్ హీరోలు రష్మిక వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.
తెలుగులో ఆమె చేతిలో `పుష్ప 2` మినహా మరో ప్రాజెక్ట్ లేదు. ఇక బాలీవుడ్ లో `యానిమల్` అనే సినిమా చేస్తోంది. అయితే రష్మిక ఆఫర్ల కోసం తన రెమ్యునరేషన్ ను తగ్గించుకునేందుకు సిద్ధమైందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటి వరకు ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న రష్మిక.. ఇకపై రూ. 3 కోట్లు తీసుకోవాలని నిర్ణయించుకుందట.
ఇటీవల తెలుగులో నితిన్ తో జోడిగా ఓ మూవీకి సైన్ చేసిందని వార్తలు వచ్చాయి. వెంకీ కుడుముల ఈ మూవీకి డైరెక్టర్. గతంలో నితిన్-రష్మిక- వెంకీ కాంబోలో ఛలో వంటి బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. ఇప్పుడు మళ్లీ వీరి కాంబో రిపీట్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే రెమ్యునరేషన్ తగ్గించుకోవడం వల్లే ఈ సినిమాలో రష్మికను నటించే అవకాశం వచ్చిందని ఇన్సైడ్ టాక్.