మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ను బాగా బాధించాయి. అసలు ఏం జరిగిందంటే.. చిరంజీవి నుంచి ఈ సంక్రాంతికి `వాల్తేరు వీరయ్య` సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలకపాత్రను పోషించారు. జనవరి 13న ఈ చిత్రం అట్టహాసంగా విడుదల కాబోతోంది. ఇటీవల వైజాగ్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
అయితే ఈ ఈవెంట్ లో చిరంజీవి.. రవితేజను మరియు తనను ఉద్దేశిస్తూ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు తీస్తున్నది ఇద్దరే ఇద్దరు.. అది మేమే అంటూ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ మాటలే హీరో కిరణ్ అబ్బవరం హర్ట్ అయ్యేలా చేశాయి. ఇందులో ఫీల్ అవ్వడానికి ఏముంది అనుకోవచ్చు. అయితే చిరంజీవి మాట్లాడిన మాటలను ఒక నెటిజన్ మార్ఫింగ్ చేశారు. చిరు ఫేస్ మీద కిరణ్ అబ్బరం ముఖం, రవితేజ ఫేస్ మీద ఆది సాయికుమార్ ముఖం పెట్టి అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా షేర్ చేశాడు.
ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. అయితే ఈ వీడియోని చూసిన పలువురు నెటిజన్లు కిరణ్ అబ్బవరం, ఆది సాయికుమార్ జనం మీద బలవంతంగా వరుస పెట్టి సినిమాలు వదులుతున్నారంటూ నెగిటివ్ కామెంట్స్ చేశారు. దీంతో కిరణ్ అబ్బరంకు చిర్రెత్తుకొచ్చింది. మార్ఫింగ్ చేసి వీడియోను పోస్ట్ చేసిన సదరు నెటిజన్కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. `మావా నా మూడేళ్ల కెరీర్లో ఐదు సినిమాలు విడుదలయ్యాయి అని నాకు తెలుసు. నాకు తెలియకుండా నా సినిమాలు ఏవైనా విడుదల అయి ఉంటే దయచేసి చెప్పండి. మీ సమాధానం కోసం ఎదురుచూస్తుంటా` అంటూ కిరణ్ ట్వీట్ చేశాడు. దీంతో ఈయన ట్వీట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది.
https://twitter.com/Kiran_Abbavaram/status/1612434171879915520?s=20&t=ZhH-Dmci-x572B-2hmXP1A