తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి 2005 ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన నరసింహుడు చిత్రంతో తెలుగుతరకు పరిచయమైంది హీరోయిన్ సమీరా రెడ్డి. ఆ తర్వాత జై చిరంజీవ, అశోక్ వంటి చిత్రాలలో నటించింది. అయితే ఆ తర్వాత 2014లో అక్షర వర్ధిని వివాహం చేసుకొని సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం ఇమే ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. తాజాగా సమీరా రెడ్డి కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించింది. పదేళ్ల క్రితం తన కెరియర్ లో జరిగిన కొన్ని విషయాలను బయట పెట్టడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.
సమీరా రెడ్డి మాట్లాడుతూ బాడీ పాజిటివిటీని ప్రోత్సహిస్తూ ఎంతోమందికి తనవంతు సహాయ సహకారాలను అందిస్తోందట. సోషల్ మీడియా వేదికగా పలు అంశాలను వీడియోల ద్వారా షేర్ చేస్తోంది.రెండో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటోంది. ఆ రోజుల్లో హీరోయిన్గా నటిస్తున్న సమయంలో బ్రెస్ట్ సర్జరీ చేయించుకోమని కొంతమంది తనని సూచించారట. అయితే దాన్ని తాను పెద్దగా పట్టించుకోలేదని తెలిపింది. 10 సంవత్సరాల క్రితం క్రేజీ ఫేస్ ఉండేది చాలామంది హీరోయిన్లు బ్రెస్ట్ కోసం ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసుకున్న రోజులవి అంతేకాకుండా గ్లామర్ గా కనిపించడం కోసం ముక్కు, ఎముకల మార్పిడిలకు సంబంధించిన ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకున్న వారు ఉన్నారని తెలిపింది.
అది గమనించిన చాలామంది తనను కూడా అలాగే చేసుకోమని సలహా ఇచ్చారట. కాని తను మాత్రం ప్యాడ్లని వాడుతూ కవర్ చేసుకునే దాన్ని అంటూ తెలియజేసింది.. అలా ఎన్నోసార్లు చేయడం వల్ల ఏంటి ఇదేమైనా ఆచారమా అని చాలా సార్లు అనుకున్నాను అని తెలిపింది సమీరారెడ్డి. కానీ అప్పట్లో సినిమాలలో ఎక్కువగా వాటిని హైలెట్ గా చేస్తూ ఉండేవారని తెలిపింది.