నందమూరి తారకరత్న ఈ నెల 27న కుప్పంలో టీడీపీ నేత లోకేశ్ చేస్తున్న పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు బెంగుళూరు నారాయణ హృదయాలయ హాస్పటల్ లో చికిత్స అందుతోంది. అయితే తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు నారాయణ హృదయాలయ వైద్యులు సోమవారం సాయంత్రం తెలిపారు.
ఆయనకు వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు సోషల్ మీడియా లో ఆయన ఆరోగ్యం పట్ల ఎవరికీ తోచినట్టు వాళ్ళు రాసుకున్నారు. దీంతో తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే తారకరత్న ని చూసేందుకు నిన్న మెగాస్టార్ చిరంజీవి బెంగళూరు కి వెళ్ళాడు.
తాజాగా ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై చిరంజీవి చేసిన ట్వీట్ నందమూరి అభిమానులకు కాస్త ఊరట కలిగించేలా ఉంది. `సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు, ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ, ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు. నీకు మంచి ఆరోగ్యంతో కూడిన లైఫ్ ఉంది తారకరత్న` అంటూ చిరు ట్వీట్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది.
https://twitter.com/KChiruTweets/status/1620257850143703041?s=20&t=Eb1nbHCq7mqmtOZMmQkjCg