కమలహాసన్ ని కాపీ కొట్టబోయి బొక్క బోర్ల పడ్డ చిరంజీవి..!!

టాలీవుడ్ లెజెండ్రీ దర్శకుడు కే. విశ్వనాథ్ ఎన్నో గొప్ప సినిమాలను తెరకెక్కించారు. అయ‌న దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలకు జాతీయ అవార్డులతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఆయన దర్శకత్వంలో 1986 కమలహాసన్ హీరోగా రాధిక హీరోయిన్‌గా వచ్చిన క్లాసికల్ మూవీ స్వాతిముత్యం. అయితే ఈ సినిమాలో హీరో మంద బుద్ధి కలిగిన వ్యక్తి పాత్రలో నటించాలి. కమలహాసన్ ఆ క్యారెక్టర్ లో అద్భుతమైన నటనతో ఒదిగిపోయాడు.

Swathi Muthyam Telugu Full Length Movie || Kamal Haasan, Raadhika || Telugu  Super Hit Movies - YouTube

ఆ పాత్రకు కమలహాసన్ మినహా మరి ఏ నటుడు న్యాయం చేయలేని విధంగా ఎంతో అద్భుతంగా నటించాడు. హీరోయిన్‌గా నటించిన రాధిక కూడా కమల్ హాసన్ కు పోటీగా ఎంతో గొప్పగా నటించింది. ఈ సినిమా ఆ రోజుల్లోనే సూపర్ హిట్ గా నిలిచి ఎన్నో జాతీయ అవార్డులను దక్కించుకొని అంతర్జాతీయ ఆస్కార్ అవార్డు కూడా నామినేట్ అయింది. అంతేకాకుండా ఈ సినిమా కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించి ఈ సినిమాలో నటించిన కమలహాసన్ కు అలాగే సినిమా దర్శకుడు విశ్వనాథ్ ప్రొడ్యూసర్ కు ఉత్తమ జాతీయ అవార్డులతో పాటు నంది అవార్డులు ఫిలింఫేర్ అవార్డులు కూడా వచ్చాయి.

Swathi Muthyam Movie || Manasu Palike Video Song || Kamal Hassan, Radhika -  YouTube
అలాంటి ఈ సినిమాలో మంద బుద్ధి క్యారెక్టర్ కు ఓ రొమాంటిక్ సాంగ్ పెట్టడం అంటే ఆ సినిమా దర్శకుడికి కూడా ఎంతో పెద్ద చాలెంజింగ్ విషయమే.. ఇక ఆ పాట మరేదో కాదు ‘మనసు పలికే మౌన గీతం’. ఈ పాటలో కమల్ మరియు రాధిక ఒకరికి ఒకరు పోటీపడి నటించారు. ఇంక దీంతో ఈ పాట అప్పటి జనాలను ఎంతగానో ఆకర్షించింది. ఈ పాట ఇప్పటికీ ప్రేక్షకులను ఆకర్షిస్తూనే ఉంది. ఈక్రమంలోనే కమల్ హాసన్- రాధిక ఈ సినిమాలో ఎలా రొమాన్స్ చేశారో అదేవిధంగా చిరంజీవి సైతం ఓ సినిమాలో చేయాలని ప్రయత్నించారట.

చిరంజీవి- సుహాసిని జంట‌గా వచ్చిన ఆరాధన సినిమాలో ఓ సాంగ్ కోసం కమలహాసన్ స్వాతిముత్యం సినిమాలో రాధికతో చేసినట్లుగా చిరంజీవి ఈ సినిమాలో కాపీ కొట్టబోయే విఫలమయ్యాడట. ఆ సినిమా దర్శకుడు ఒకరిని కాపీ కొట్టంలో ఎలాంటి ఉపయోగం ఉండదని మీరు మీలాగా నటించండి అంటూ దర్శకుడు చెప్పడంతో చిరంజీవి తన ప్రయత్నాలను మానుకున్నాడట. దీంతో కమలహాసన్ కాపీ కొట్టబోయి బొక్క బోర్ల పడ్డ చిరంజీవి నటించిన ఆ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఎవరేజ్ సినిమాగా మిగిలిపోయింది.