బాలయ్య-నాగార్జునకు వార్ అక్కడినుంచే మొదల..!!

గడిచిన మూడు రోజుల క్రితం నుంచి స్టార్ హీరో బాలకృష్ణ ,నాగార్జున మధ్య పెద్ద వార్ జరుగుతోంది. ఇక వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో పలు రకాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇద్దరు హీరోల మధ్య గొడవకు కారణం బాలయ్య హీరోగా నటించిన శ్రీమన్నారాయణ సినిమా అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రవి చావలి దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది. హీరోయిన్గా ఇషా చావ్లా, పార్వతి మెల్టన్ నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

Srimannarayana (2012) - IMDbఈ సినిమా 2012 ఆగస్టు 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా విడుదలైన వారం రోజుల తర్వాత నాగార్జున నటించిన శిరిడి సాయి సినిమా విడుదల కావడం జరిగింది. ఆ సమయంలో కొన్ని థియేటర్లలో శ్రీమన్నారాయణ సినిమాను తొలగించి మరి శిరిడి సాయి సినిమాకి థియేటర్లు కేటాయించినట్లు తెలుస్తోంది. అది కూడా కూకట్పల్లిలోని ప్రముఖ థియేటర్ విషయంలో గొడవ జరిగినట్లుగా గతంలో ప్రచారం జరిగింది. ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో. ఈ సినిమా నిర్మాతలు ఫైర్ అవడం జరిగిందట. ఇక అప్పటినుంచి బాలయ్య నాగార్జునల మధ్య దూరం పెరిగిపోతూనే ఉందట.

Watch Shirdi Sai - Disney+ Hotstarఇక ఏఎన్నార్ మరణించినప్పుడు కూడా బాలయ్య అక్కడికి వెళ్లకపోవడం వెనుక అసలు కారణం ఇదే అన్నట్లుగా సమాచారం. ఇక అప్పటి నుంచి బాలయ్య నాగార్జున సినిమాలు ఎప్పుడూ పోటీ పడుతూనే ఉన్నాయట. అలా బాలకృష్ణ డిక్టేటర్, నాగార్జున సోగ్గాడే చిన్నినాయన సినిమాలు కేవలం ఒక్కరోజే విడుదల కావుగా నాగార్జున విజేతగా నిలిచారు. కానీ వీరిద్దరూ మాత్రం ఎన్నో సందర్భాలలో తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలియజేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది