మ‌రోసారి త‌న‌లోని గాయ‌కుడిని బ‌య‌ట‌కు తీసిన బాల‌య్య‌.. వీడియో వైర‌ల్‌!

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహారెడ్డి సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. టాక్ తో సంబంధం లేకుండా బ‌య్య‌ర్ల‌కు కాసుల వ‌ర్షం కురిపించింది. ఈ నేప‌ధ్యంలోనే వీర‌ సింహారెడ్డి విజయోత్సవ సభను నిన్న హైదరాబాద్ లోని జేఆర్సి కన్వెన్షన్ హాల్లో అట్టహాసంగా నిర్వహించారు.

ఈ ఈవెంట్లో బాలయ్య రెట్టింపు ఎనర్జీతో కనిపించారు. అలాగే ఈ విజయోత్సవ సభలో బాలయ్య మరోసారి తనలోని గాయ‌కుడిని బయటకు తీశారు. గతంలో తాను నటించిన `మాతో పెట్టుకోకు` సినిమాలోని `మాఘ‌మాసం ల‌గ్గం పెట్టిస్తా` అనే పాట‌ను స్టేజ్‌పై సింగ‌ర్‌తో క‌లిసి పాడాడు బాల‌కృష్ణ‌.

ఇందుకు సంబంధించిన వీడియోను వీర‌సింహారెడ్డి చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట‌ తెగ చక్కర్లు కొడుతుంది. కాగా గతంలో బాలయ్య `మేము సైతం` ఈవెంట్లో లెజెండ్ సినిమాలోని `నీ కంటి చూపుల్లో` అనే పాట‌ను పాట ట్రెండ్ అయ్యారు. ఇప్పుడు మరోసారి పాట పాడి అభిమానులను అలరించారు.

https://twitter.com/MythriOfficial/status/1617171920868487168?s=20&t=AIe1RnrXAjohPKfM7hvbdQ