మహిళలను ఎందుకు అలా చూపిస్తారు.. ఫైర్ అయిన విజయశాంతి..!!

అలనాటి సీనియర్ హీరోయిన్లలో హీరోయిన్ విజయశాంతి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయశాంతి లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించి అద్భుతమైన విజయాలను అందుకుంది. దీంతో ఈమెకు లేడీస్ సూపర్ స్టార్ అనే బిరుదు కూడా సంపాదించుకుంది. ప్రస్తుతం విజయశాంతి రాజకీయాలలో బిజీగా ఉండడం చేత సినిమాలకు గుడ్ బై చెప్పి దాదాపుగా ఎన్నో సంవత్సరాలు అయింది.. కానీ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది.

తాజాగా సోషల్ మీడియా వేదికగా విజయశాంతి చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. సోషల్ మీడియా లోనే ఒక మహిళ అభిమాని విజయశాంతిని ప్రశ్నిస్తూ.. మగవాళ్ళు తీసే ప్రతి చిత్రాలలో కూడా మహిళలను ఎందుకు దెయ్యాలుగా చూపిస్తారని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు విజయశాంతి సమాధానం తెలియజేస్తూ..మన పురాణాలలో మగవాళ్ళు కూడా రాక్షసులుగా ఉంటారని మనం అడగవచ్చు.. మగవాళ్ళు తీసే సినిమాల్లో ఆడవాళ్లను దెయ్యాలుగా చూపిస్తున్నారు. ఆడవాళ్లు తీసే సినిమాలలో మగవాళ్ళకు కూడా దెయ్యాలుగా చూపించవచ్చు. అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం విజయశాంతి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. కానీ ఈ విషయం చాలా సరదాగా చెప్పానని తెలిపింది విజయశాంతి.

ఈ వార్తలపై పలువురు నేటిజన్స్ సైతం పాజిటివ్ కామెంట్లు చేయగా.. మరికొంతమంది నెగిటివ్గా స్పందిస్తున్నారు. విజయశాంతి అభిమానులు మాత్రం సినిమాలలో నటించాలని కోరుకుంటున్నారు. విజయశాంతి సినిమాలలో నటిస్తే ఆమెకు ఎంతైనా ఇచ్చి సినిమాలలో నటించేందుకు దర్శకనిర్మాతలు ఇప్పటికి సిద్ధంగానే ఉన్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ విజయశాంతి మాత్రం ప్రస్తుతం సినిమాల పైన పెద్దగా ఆసక్తి లేదని రాజకీయాలలోని బిజీగా ఉంటోంది.