కీర్తి సురేష్ కొత్త అవ‌తారం.. రిస్క్ ఎందుకు అమ్మ‌డు?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న మలయాళ ముద్దుగుమ్మల్లో కీర్తి సురేష్ ఒకరు. ముఖ్యంగా మహానటి సినిమాతో కీర్తి సురేష్ తెలుగు సినీ పరిశ్ర‌మ‌లో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. అలాగే జాతీయస్థాయిలో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు న్యాచురల్ స్టార్ నానికి జోడిగా `దసరా` అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ డీగ్లామర్ లుక్ లో అలరించబోతోంది. అలాగే మరోవైపు మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా `భోళా శంకర్` చిత్రానికి సైన్‌ చేసింది. ఇక ఉదయనిధి స్టాలిన్ తో `మామన్నన్`, జయం రవికి జోడీగా `సైరన్` చిత్రాలు చేస్తోంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. కీర్తి సురేష్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట‌ వైరల్ గా మారింది.

అదేంటంటే ఈ అమ్మడు నిర్మాతగా కొత్త అవతారం ఎత్తబోతోందట. ఓ మంచి కంటెంట్ తో కూడిన చిన్న సినిమాల‌ను నిర్మిస్తూ కొత్త వాళ్ళని ప్రోత్సహించాలని కీర్తి సురేష్ భావిస్తుందట. అంతేకాదు త్వరలోనే నిర్మాణ సంస్థను సైతం స్థాపించబోతోందని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారం పట్ల కొందరు సానుకూలంగా స్పందిస్తుంటే.. మరి కొందరు మాత్రం హీరోయిన్ గా సక్సెస్ ఫుల్ గా ర‌న్‌ అవుతున్న సమయంలో ఈ రిస్క్ ఎందుకు అమ్మ‌డు అంటూ కామెంట్లు చేస్తున్నారు.